News July 27, 2024
చంద్రబాబు పక్షాన కాకుండా ప్రజల పక్షాన నిలబడండి: YCP

AP: ఢిల్లీలో జగన్ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించాలన్న షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ మండిపడింది. ‘ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీతో అత్యంత సన్నిహిత సంబంధాలు నడుపుతోంది చంద్రబాబు కాదా? అక్రమ రాజకీయ సంబంధాల్లో మీరు ఒక పావు మాత్రమే అని, మీ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారని ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు పక్షాన కాకుండా ప్రజల పక్షాన నిలబడటం నేర్చుకోండి’ అని ట్వీట్ చేసింది.
Similar News
News February 11, 2026
VASTHU: స్మశానాలకు దగ్గర నివసించవచ్చా?

స్మశానాలకు దగ్గరగా నివసించడం శ్రేయస్కరం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘స్మశానాల వద్ద జరిగే కార్యక్రమాలు నిరాశను, వైరాగ్యాన్ని కలిగిస్తాయి. అక్కడి గాలి అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇది మనిషి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. అందుకే నిలకడైన అభివృద్ధి కోసం ఇలాంటి ప్రదేశాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోకపోవడమే ఉత్తమం’. అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 11, 2026
చికెన్లో ఈ భాగాలు తినకండి

కోళ్ల లంగ్స్లోని పరాన్నజీవులు ఎక్కువ వేడిని తట్టుకోగలవు. మనం బాగా ఉడికించినా కొన్ని నశించకపోవచ్చు. పెస్టిసైడ్స్ తింటే కోడి తలలో చిన్న కణితులు ఏర్పడతాయి. కాబట్టి తల జోలికి వెళ్లకపోవడం బెటర్. కాళ్ల వేళ్లు, ప్రేగులు, జీర్ణాశయంలో బాక్టీరియా పేరుకుంటుంది. సాధారణంగా శుభ్రం చేస్తే అవి పోవు. స్కిన్ పూర్తిగా కొలెస్ట్రాల్ కావడంతో ఊబకాయులు, హార్ట్ సమస్యలు ఉన్నవారు తినకండి.
News February 11, 2026
జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం ఆగ్రహం

TG: సంగారెడ్డిలో జగ్గారెడ్డి <<19110877>>వ్యవహారంపై<<>> రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయన కామెంట్స్ ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. ఆయనపై కేసు నమోదు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. కాగా సీఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా పట్టుకున్నారంటూ పోలీసులపై జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ఆపుతానంటూ పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.


