News April 19, 2024
ఎడ్సెట్కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
AP: బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్సెట్కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.1000తో మే 19, రూ.2000తో మే 21 వరకు అప్లై చేసుకోవచ్చు. మే30న హాల్టికెట్లు విడుదల చేస్తారు. జూన్ 8న పరీక్ష నిర్వహిస్తారు. వెబ్సైట్: https://cets.apsche.ap.gov.in/
Similar News
News October 14, 2024
స్పెషల్ బస్సుల్లోనే ధరలు పెంచాం: సజ్జనార్
బస్సు ఛార్జీలు పెంచినట్లు వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని TGSRTC ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. 2003లో జీవో- 16 ప్రకారం స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. ‘రెగ్యులర్ సర్వీస్ల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు 500 స్పెషల్ బస్సులను సంస్థ నడుపుతోంది. వీటిలో మాత్రమే ఛార్జీలు పెంచాం. మిగతా రోజుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయి’ అని స్పష్టం చేశారు.
News October 14, 2024
ఇండియా-A కెప్టెన్గా తిలక్వర్మ
అక్టోబర్లో జరిగే ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో ఇండియా-A జట్టుకు హైదరాబాదీ క్రికెటర్ తిలక్వర్మ కెప్టెన్సీ చేయనున్నారు. అతడికి డిప్యూటీగా అగ్రెసివ్ ఓపెనర్ అభిషేక్శర్మ వ్యవహరించనున్నారు. ఈ టోర్నీ ఒమన్ వేదికగా అక్టోబర్ 18-27 మధ్య జరగనుంది. గ్రూప్-Aలో బంగ్లాదేశ్-A, శ్రీలంక-A, అఫ్గానిస్థాన్-A, హాంకాంగ్ ఉండగా గ్రూప్-Bలో ఇండియా-A, పాకిస్థాన్-A, UAE, ఒమన్ ఉన్నాయి.
News October 14, 2024
DANGER: అలాంటి టీ తాగుతున్నారా?
చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగడం అలవాటు. కొందరు ఒకేసారి ఎక్కువగా టీ పెట్టుకొని మరలా కాచుకొని తాగుతుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీ కాచుకున్న 15-20 నిమిషాల్లోపు తాగడం మంచిదని చెప్పారు. దీనిని విస్మరిస్తే జీర్ణశయాంతర వ్యవస్థ, ముఖ్యంగా కాలేయం దెబ్బతింటుందన్నారు. జపాన్లో కాచి పక్కన పెట్టిన టీని పాము విషం కంటే ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారని తెలిపారు.