News April 24, 2024
హైస్కూల్ పూర్తవగానే లా ప్రాక్టీస్ మొదలుపెట్టండి: పిటిషనర్పై CJI ఆగ్రహం

ఇంటర్ తర్వాత ఐదేళ్లకు బదులుగా మూడేళ్ల లా కోర్సు(LLB) చదివేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై CJI జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మూడేళ్లు కూడా ఎందుకు? హైస్కూల్ పూర్తవగానే లా ప్రాక్టీస్ మొదలుపెట్టండి’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుత విధానం సరిగానే ఉందని పేర్కొంది. కాగా ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసినవారు మాత్రమే నేరుగా మూడేళ్ల లా కోర్సులో చేరేందుకు అవకాశం ఉంది.
Similar News
News March 27, 2026
ఈ టైమ్లో ఎక్సర్సైజ్ చేస్తే గుండె సేఫ్!

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేసే టైమింగ్ ముఖ్యమని తాజా స్టడీలో తేలింది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య వర్కౌట్ చేసేవారికి గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తక్కువగా ఉంటుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వెల్లడించింది. దీనివల్ల ఒబెసిటీ 35%, గుండె జబ్బులు 31%, షుగర్ రిస్క్ 30% తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. ఉదయం ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉండటం, కొవ్వు త్వరగా కరగడం దీనికి కారణాలు.
News March 27, 2026
బ్రేక్ఫాస్ట్ మెనూ రెడీ: 6 రోజులు.. 5 రకాలు

TG: ప్రభుత్వ స్కూళ్లలో 19 లక్షల మంది విద్యార్థుల కోసం ‘CM బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ మెనూను అధికారులు రెడీ చేశారు. దీని కోసం ప్రభుత్వం ₹720 కోట్లు కేటాయించింది. ఈ మెనూ ప్రకారం.. సోమవారం దోశ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ, బుధవారం పూరీ, గురువారం మిల్లెట్ ఇడ్లీ, శుక్రవారం మిల్లెట్ ఉప్మా/పొంగల్, శనివారం బోండా అందజేస్తారు. అలాగే సోమ, బుధ, శుక్రవారాల్లో పాలు.. మంగళ, గురు, శనివారాల్లో రాగి జావ ఇస్తారు.
News March 27, 2026
ఈ శ్రీరాముడి గుణాలే తారకమంత్రం!

శ్రీరాముడి నాయకత్వ లక్షణాలు నేటికీ ఆదర్శమే. ఎన్ని కష్టాలొచ్చినా నమ్మిన ధర్మాన్ని, విలువలను పక్కనపెట్టలేదు. భరతుడికి కబురు పంపితే రావణుడిపై దండెత్తడానికి మహాసైన్యమే వచ్చేది. కానీ 14ఏళ్ల వనవాసానికి భంగం కలగొద్దని వానరులనే రామదండుగా మార్చుకున్నాడు. ఉన్న వనరులతోనే విజయాలు సాధించొచ్చనడానికి ఇదో ఉదాహరణ. నిజాయతీ, నిబద్ధత, సమానత్వం, సమయపాలన పాటిస్తూ ఏ పని ఎవరికి అప్పగించాలో గ్రహించగలిగే సమర్థుడు రాముడు.


