News June 18, 2024

దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్ ప్రారంభించండి: టీటీడీ ఈవో

image

TTD ఈవో జే.శ్యామలారావు అధికారులకు కీలక సూచనలు చేశారు. కాలినడక భక్తులకు 1200వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. APSRTC, టూరిజం కోటా దర్శన టికెట్లు నిరుపయోగం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు కచ్చితమైన దర్శన సమయాలు తెలిసేలా నారాయణగిరి షెడ్ల వద్ద ఎలక్ట్రానిక్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.

Similar News

News December 23, 2025

TDP-JSP అబద్ధాలు బయట పడ్డాయి: జగన్

image

AP: వైసీపీ హయాంలో AP బ్రాండ్ దెబ్బతిందంటూ TDP, JSP చెప్పింది అబద్ధమని తేలినట్లు Ex.CM జగన్ పేర్కొన్నారు. ‘AP బ్రాండ్, పెట్టుబడులు దెబ్బతిన్నాయని వారు ఆరోపించారు. కానీ RBI డేటా ప్రకారం 2019-24 మధ్య మాన్యుఫాక్చరింగ్‌లో సౌత్‌లో AP ఫస్ట్, దేశవ్యాప్తంగా ఐదోస్థానంలో ఉంది. ఇండస్ట్రీ సెక్టార్‌లో సౌత్‌లో ఫస్ట్, దేశంలో 8వ స్థానంలో నిలిచింది. దీనిని బ్రాండ్ దెబ్బతినడం అంటారా?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

News December 23, 2025

రికార్డుల రేసులో బంగారం, వెండి ధరలు..!

image

అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర ఇవాళ తొలిసారిగా ఔన్స్ $70 మార్కు తాకింది. అటు బంగారం ధర కూడా ఔన్స్‌కు $4,484 ఆల్-టైమ్ గరిష్ఠానికి చేరింది. సామాన్యులకు భారంగా మారుతున్నా, ఇన్వెస్టర్లకు మాత్రం పసిడి లాభాల పంట పండిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఓవరాల్‌గా 2025లో గోల్డ్ ₹60,550 (జనవరిలో 10గ్రా సగటున ₹78K ఉంటే నేడు ₹1,38,000) కేజీ వెండి ₹1.36లక్షలు పెరిగింది (JANలో ₹90K, ఇవాళ ₹2,34,000).

News December 23, 2025

DANGER: చలికాలమే అని నీళ్లు తాగట్లేదా?

image

చలికాలంలో బాడీకి నీళ్ల అవసరం లేదని చాలామంది పొరబడుతుంటారు. కానీ శ్వాస, యూరిన్ ద్వారా బాడీలోని వాటర్ బయటకు పోతుంది. రక్తం చిక్కగా మారి గుండె మీద ప్రెజర్ పడుతుంది. BP పెరుగుతుంది. కిడ్నీలు మలినాలను క్లీన్ చేయలేవు. స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది. స్కిన్ డ్రై అవ్వడం, పెదవులు పగలడం, మలబద్ధకం వంటి డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయి. అందుకే వింటర్లోనూ 2-3 లీటర్ల నీళ్లు తాగాలనేది డాక్టర్ల సూచన.