News July 2, 2024

ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్?

image

TG: ఈ నెల 23న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో కేంద్రం బడ్జెట్‌ను ఈ నెల 22న ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్యారంటీలు, సాగునీటి రంగానికి అధిక కేటాయింపులు ఉండొచ్చని అంచనా. చర్చలు పూర్తయ్యాక దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

Similar News

News September 20, 2024

వాటర్ హీటర్ వాడుతున్నారా?

image

వాటర్ హీటర్‌తో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిన్న NZB జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నీళ్లు వేడెక్కాయో లేదో చూసేందుకు హీటర్ ఉండగానే బకెట్‌లో చేయి పెట్టడంతో షాక్ తగిలి మరణించాడు. స్విచ్ఛాఫ్ చేసి ప్లగ్ తీసేసిన తర్వాతే నీటిని ముట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇనుము లేదా స్టీల్ కాకుండా ప్లాస్టిక్ బకెట్లు వాడాలని, అవి కరగకుండా ఓ చెక్క ముక్క ఉపయోగించాలంటున్నారు.
>SHARE IT

News September 20, 2024

మాజీ మంత్రి విడదల రజనిపై హోంమంత్రికి ఫిర్యాదు

image

AP: మాజీ మంత్రి రజని, ఆమె PA తమను బెదిరించి ₹2.20cr వసూలు చేశారని పల్నాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ సంస్థ సహ యజమాని చలపతిరావు హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. 2020లో తనను పిలిచి మాట్లాడారని, డబ్బులు ఇవ్వకపోతే కంపెనీని సీజ్ చేయిస్తామని బెదిరించారన్నారు. 2021లో ₹2.20cr ఇచ్చినట్లు తెలిపారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై హోంమంత్రి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

News September 20, 2024

కొత్త రేషన్ కార్డులపై రేపే తుది నిర్ణయం!

image

TG: కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం రేపు సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై తుదినిర్ణయం తీసుకోనుంది. రైతు భరోసాపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.