News April 7, 2025

రాష్ట్రానికి రూ.34,600 కోట్ల మద్యం ఆదాయం

image

TG: ఈ ఏడాది రాష్ట్రానికి మద్యం ద్వారా భారీ ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2024-25 ఏడాదికిగానూ మద్యం అమ్మకాల ద్వారా రూ.34,600 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 7% విక్రయాలు పెరిగినట్లు స్పష్టం చేసింది. పన్నుల రూపంలో రూ.7,000 కోట్లు, దరఖాస్తుల ద్వారా 264 కోట్లు వచ్చాయంది. బీర్ల కంపెనీలు 15 రోజులు సరఫరా నిలిపివేయడంతో వీటి అమ్మకాలు 3% తగ్గినట్లు పేర్కొంది.

Similar News

News April 13, 2025

ALERT: నేడు 30 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

AP: ఇవాళ రాష్ట్రంలోని 30 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. అలాగే 67 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం-7, విజయనగరం-11, మన్యం-10, ఏలూరు-1, ఎన్టీఆర్ జిల్లాలోని 1 మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలంది. స్థానిక వాతావరణం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్త పడాలని సూచించింది.

News April 13, 2025

SRH ఛేజింగ్ చూస్తే నవ్వొస్తోంది: శ్రేయస్ అయ్యర్

image

SRH ఓపెనర్లు అద్భుతంగా ఆడారని, తాను ఇప్పటి వరకు చూసిన ఇన్నింగ్స్‌లలో అభిషేక్ బ్యాటింగ్ అత్యుత్తమమని SRHతో ఓటమి తర్వాత PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కొనియాడారు. 245రన్స్‌ను 9బంతులు మిగిల్చి ఛేదించడం చూస్తే నవ్వొస్తోందని చెప్పారు. అభిషేక్ అదృష్టవంతుడని, అతని క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత చెలరేగి ఆడాడని తెలిపారు. తొలుత 230స్కోర్ చేస్తే గెలుస్తామని భావించినా, 2వ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపిందన్నారు.

News April 13, 2025

ఏప్రిల్ 13: చరిత్రలో ఈరోజు

image

1919: పంజాబ్ జలియన్ వాలాబాగ్‌‌లో జనరల్ డయ్యర్ జరిపిన కాల్పుల్లో 379 మంది ఉద్యమకారులు మృతి
1999: నాదస్వర విద్వాంసులు షేక్ చిన మౌలానా మరణం
1999: ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు మరణం
2007: నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి మరణం
2007: రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మరణం
* జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవం

error: Content is protected !!