News April 7, 2025
రాష్ట్రానికి రూ.34,600 కోట్ల మద్యం ఆదాయం

TG: ఈ ఏడాది రాష్ట్రానికి మద్యం ద్వారా భారీ ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 2024-25 ఏడాదికిగానూ మద్యం అమ్మకాల ద్వారా రూ.34,600 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 7% విక్రయాలు పెరిగినట్లు స్పష్టం చేసింది. పన్నుల రూపంలో రూ.7,000 కోట్లు, దరఖాస్తుల ద్వారా 264 కోట్లు వచ్చాయంది. బీర్ల కంపెనీలు 15 రోజులు సరఫరా నిలిపివేయడంతో వీటి అమ్మకాలు 3% తగ్గినట్లు పేర్కొంది.
Similar News
News November 18, 2025
అమిత్ షా డెడ్లైన్కి ముందే హిడ్మా ఎన్కౌంటర్!

AP: అల్లూరి(D) మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్లైన్ కంటే ముందే ఇది జరిగిందని తెలుస్తోంది. 2026 మార్చి 31నాటికి దేశంలో నక్సలిజాన్ని రూపుమాపాలని అమిత్ షా గడువు విధించిన విషయం తెలిసిందే. అప్పుడే NOV 30లోపు హిడ్మా ఎన్కౌంటర్ జరగాలని ఆదేశాలిచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
News November 18, 2025
అమిత్ షా డెడ్లైన్కి ముందే హిడ్మా ఎన్కౌంటర్!

AP: అల్లూరి(D) మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్లైన్ కంటే ముందే ఇది జరిగిందని తెలుస్తోంది. 2026 మార్చి 31నాటికి దేశంలో నక్సలిజాన్ని రూపుమాపాలని అమిత్ షా గడువు విధించిన విషయం తెలిసిందే. అప్పుడే NOV 30లోపు హిడ్మా ఎన్కౌంటర్ జరగాలని ఆదేశాలిచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
News November 18, 2025
వాట్సాప్లో ‘మీ-సేవ’.. Hi అని పంపితే చాలు!

TG: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ ద్వారా మీ-సేవా సర్వీసులను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందే అవకాశముంది. 80969 58096 నంబర్కు Hi అని మెసేజ్ చేసి సేవలు పొందవచ్చు. ఇన్కం, బర్త్, క్యాస్ట్, డెత్ సర్టిఫికెట్ల దరఖాస్తుతో పాటు విద్యుత్, నీటి బిల్లులు, ఆస్తి పన్నులు చెల్లించవచ్చు.


