News September 10, 2025
తిరోగమనంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ: జగన్

AP: రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోందని మాజీ CM జగన్ విమర్శించారు. పాలన ప్రజల కోసమా? దోపిడీదారుల కోసమా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని మండిపడ్డారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలకు అందాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయ ప్రయోజనాలు దోపిడీదారులకు అందుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. శాంతిభద్రతలు కనిపించడం లేదు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వ ఉందా’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News September 10, 2025
విజయవాడలో వే2న్యూస్ కాన్క్లేవ్

నవ్యాంధ్రప్రదేశ్ను రాబోయే పదేళ్లలో ఎలా చూడబోతున్నామో ప్రభుత్వం, ఇండస్ట్రీ నిపుణులు వివరించే వేదిక Way2News కాన్క్లేవ్. విజయవాడ CK కన్వెన్షన్లో ఈనెల 12న జరిగే తొలి డిజిటల్ మీడియా సదస్సులో CM చంద్రబాబు, విపక్ష నేతలు పాల్గొంటున్నారు. అటు గీతం విద్యాసంస్థల ఛైర్మన్, వైజాగ్ ఎంపీ భరత్, అమలాపురం ఎంపీ హరీశ్ బాలయోగి కూడా వేదికపై తమ ఆలోచనలు, రోడ్ మ్యాప్ పంచుకోబోతున్నారు.
Note: Entry By Invitation Only
News September 10, 2025
హీరోయిన్ నయనతారకు నోటీసులు

హీరోయిన్ నయనతారకు తమిళనాడు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. <<14567761>>డాక్యుమెంటరీ<<>>లో చంద్రముఖి మూవీ క్లిప్స్ను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్మాతలు కోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు ‘నేను రౌడీనే’ క్లిప్ వాడటంపై ఆ మూవీ నిర్మాత ధనుష్ సైతం కోర్టును ఆశ్రయించారు. వీటిపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు మూవీ క్లిప్లు వాడటంపై అక్టోబర్ 6లోపు సమాధానమివ్వాలని నయనతార, నెట్ఫ్లిక్స్కు నోటీసులు జారీ చేసింది.
News September 10, 2025
మంచి నిద్ర కోసం చదవాల్సిన శ్లోకం

అగస్త్యో మాధవశ్చైవ
ముచకుందో మహామునిః
కపిలో మునిరాస్తీకః
పంచయతే సుఖశాయనః
ఈ ప్రసిద్ధమైన శ్లోకాన్ని పఠించి పడుకుంటే హాయిగా నిద్ర పడుతుందని పండితులు చెబుతున్నారు. మంచి నిద్ర కోసం రుషులను తలచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. వారి పేర్లు(అగస్త్య, మాధవ, ముచుకుంద, కపిల, ఆస్తీక) కలిపి ఈ శ్లోకాన్ని రాశారు.