News October 25, 2024

ముగిసిన రాష్ట్ర మంత్రుల దక్షిణ కొరియా పర్యటన

image

TG: రాష్ట్ర మంత్రుల బృందం దక్షిణ కొరియా పర్యటన ముగిసింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అధికారులు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. సియోల్‌తో పాటు ఇంచియాన్ నగరంలో నదుల ప్రక్షాళన, మురుగునీటి శుద్ధీకరణపై అధికారులతో కలిసి మంత్రులు అధ్యయనం చేశారు. మూసీ పునరుజ్జీవం కోసం సీఎం ఆదేశాలతో తాము ఆ దేశంలో పర్యటించినట్లు పొంగులేటి తెలిపారు.

Similar News

News December 5, 2025

ఈ కంటెంట్ ఇక నెట్‌ఫ్లిక్స్‌లో..

image

Warner Bros(WB)ను నెట్‌ఫ్లిక్స్ <<18481221>>సొంతం<<>> చేసుకోవడంతో విస్తృతమైన కంటెంట్‌ అందుబాటులోకి రానుంది. 2022 లెక్కల ప్రకారం WBలో 12,500 సినిమాలు, 2,400 టెలివిజన్ సిరీస్‌లు(1,50,000 ఎపిసోడ్లు) ఉన్నాయి. దాదాపు 1,45,000 గంటల కంటెంట్ ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, ది బిగ్ బ్యాంగ్ థియరీ, హ్యారీపొటర్, ది సోప్రానోస్, ఫ్రెండ్స్, ది మెంటలిస్ట్, సూపర్ న్యాచురల్, ది వైర్ లాంటి సూపర్ హిట్ సిరీస్‌లను WBనే నిర్మించింది.

News December 5, 2025

మోతాదు మించితే పారాసిటమాల్ ప్రమాదమే: వైద్యులు

image

సరైన మోతాదులో తీసుకుంటే పారాసిటమాల్ సురక్షితమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే అధిక మోతాదులో వాడటం వల్ల లివర్ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. ‘రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఆల్కహాల్‌ సేవించినప్పుడు & ఉపవాసంలో ఉన్నప్పుడు ఈ మాత్రలు వేసుకోవద్దు. జలుబు/ఫ్లూ ట్యాబ్లెట్లలో కూడా పారాసిటమాల్ ఉంటుంది కాబట్టి రోజువారీ మోతాదును సరిచూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News December 5, 2025

1000 ఇండిగో సర్వీసులు రద్దు.. సారీ చెప్పిన CEO

image

విమానాలు ఆలస్యంగా నడవడం, పలు సర్వీసుల రద్దుతో ఇబ్బందిపడిన వారందరికీ ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ క్షమాపణలు చెప్పారు. విమాన సేవల్లో అంతరాయాన్ని అంగీకరిస్తున్నామని, 5 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఫ్లైట్ క్యాన్సిల్ సమాచారం అందుకున్న ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి ఇబ్బంది పడొద్దని కోరారు. నేడు వెయ్యికిపైగా సర్వీసులు రద్దవగా, సంస్థ తీసుకుంటున్న చర్యలతో రేపు ఆ సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది.