News July 17, 2024

రాష్ట్ర ఆర్థిక దుస్థితిని అమిత్ షాకు వివరించా: CM చంద్రబాబు

image

AP: గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతలా దిగజారిందో అమిత్ షాకు వివరించినట్లు CM చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకు విడుదల చేసిన 4 శ్వేతపత్రాలపై ఆయనతో చర్చించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ అసమర్థత, అవినీతి రాష్ట్రానికి తీరని నష్టాన్ని కలిగించాయని ట్వీట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతాయని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు.

Similar News

News March 26, 2026

రెడీగా 1.12 లక్షల ఇందిరమ్మ ఇండ్లు.. జూన్ కల్లా మరో లక్ష: పొంగులేటి

image

TG: రాష్ట్రవ్యాప్తంగా 1.12 లక్షల ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి పొంగులేటి ప్రకటించారు. జూన్ నాటికి మరో లక్ష ఇళ్లను పూర్తి చేస్తామని, ఏప్రిల్‌లో రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయిస్తామన్నారు. ఇళ్ల ఎంపిక కోసం గ్రామ కమిటీల్లో సర్పంచ్‌లు అధ్యక్షులుగా ఉంటారని, ఇందులో MLAల ప్రాతినిధ్యంపై ఆలోచిస్తామని తెలిపారు.

News March 26, 2026

వరల్డ్ నంబర్ వన్ లీడర్ మోదీ: 68% రేటింగ్‌తో మళ్లీ టాప్!

image

USకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్’ లేటెస్ట్ సర్వే ప్రకారం 68% అప్రూవల్ రేటింగ్‌తో మోదీ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్‌గా నిలిచారు. రెండో స్థానంలో స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ పార్మెలిన్, సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ (62%) ఉన్నారు. US అధ్యక్షుడు ట్రంప్ (39%), బ్రిటన్ PM కీర్ స్టార్మర్ (24%) మోదీ కంటే వెనుకబడ్డారు. అలాగే నెహ్రూ తర్వాత అత్యధిక కాలం PMగా ఉన్న వ్యక్తిగా మోదీ చరిత్ర సృష్టించారు.

News March 26, 2026

ట్రంప్ నరకం చూపిస్తారు: వైబ్ హౌస్

image

ఇరాన్ తన ఓటమిని అంగీకరించకపోతే ఆ దేశాన్ని ఘోరంగా దెబ్బకొడతామని అమెరికా హెచ్చరించింది. ట్రంప్ అస్సలు తగ్గరని.. నరకాన్ని చూపిస్తారని వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ప్రస్తుతం యుద్ధం నాలుగో వారంలో ఉండగా అగ్రరాజ్యం తన లక్ష్యాలకు చాలా దగ్గరలో ఉందని వెల్లడించింది. ఒకవైపు పాకిస్థాన్, తుర్కియే మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నా ఇరాన్ లొంగిపోవడమే మార్గమని వాషింగ్టన్ స్పష్టం చేస్తోంది.