News December 17, 2024
జమిలి బిల్లుతో రాష్ట్రాలకు ఇబ్బంది లేదు: అర్జున్ మేఘ్వాల్

జమిలి ఎన్నికల బిల్లు ద్వారా సమాఖ్య విధానం, రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ అన్నారు. కేశవానంద భారతీ కేసులో సుప్రీం కోర్టు సమాఖ్య విధానం గురించి వివరించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర, కాంకరెంట్ లిస్టులోని అంశాలపై అంబేడ్కర్ చెప్పిన కొటేషన్స్ను కోట్ చేశారు. వాటి ప్రకారం ఈ బిల్లుతో రాష్ట్రాల అసెంబ్లీలకు ఇబ్బందేమీ ఉండదన్నారు. బిల్లును JPCకి పంపుతామన్నారు.
Similar News
News December 5, 2025
MBNR: విద్యార్థికి వేధింపులు.. ఇద్దరు సస్పెండ్

జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థిని వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపల్ రజిని రాగమాల, వైస్ ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మిని సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థిని వేధింపులకు పాల్పడిన సంఘటన ఉమ్మడి జిల్లాలో గురువారం సంచలనంగా మారింది. DSP వెంకటేశ్వర్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
News December 5, 2025
వామ్మో.. ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.40వేలు

వందల సంఖ్యలో ఇండిగో ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో దేశీయ విమాన టికెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఢిల్లీ టు లండన్ టికెట్ ధర రూ.25వేలు ఉంటే ఢిల్లీ టు కొచ్చి టికెట్ ఫేర్ ఏకంగా రూ.40వేలకు పెంచేశారు. ఇది సాధారణంగా రూ.5,000-రూ.10,000 మధ్య ఉంటుంది. ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.40,452కు ఎగబాకింది. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రేట్లు పెంచవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
News December 5, 2025
బెంజ్, రేంజ్ రోవర్ కాకుండా ఫార్చునర్.. అందుకేనా?

నిన్న మోదీ, పుతిన్ టయోటా ఫార్చునర్ కారులో ప్రయాణించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రేంజ్ రోవర్, బెంజ్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ వారు ఫార్చునర్లోనే ప్రయాణించారు. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా 2022లో అమెరికాతో పాటు యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశాల కార్లు కాకుండా జపాన్కు చెందిన టయోటాను ఎంచుకుని మోదీ, పుతిన్ వారికి బలమైన సందేశం పంపినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.


