News June 28, 2024

మరో 2 వైసీపీ కార్యాలయాలపైనా స్టేటస్ కో

image

AP: ఉండి, నరసరావుపేట వైసీపీ కార్యాలయాల కూల్చివేత నోటీసులపై స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 18 ఆఫీసుల విషయంలో ఇలాంటి ఆదేశాలిచ్చింది. తుది తీర్పు వచ్చే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. అనుమతుల్లేకుండా వైసీపీ కార్యాలయాలు కడుతున్నారంటూ ప్రభుత్వం నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News October 24, 2025

టుడే టాప్ స్టోరీస్

image

* హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని TG క్యాబినెట్ నిర్ణయం
* ఇండియా టెక్ డెస్టినేషన్‌గా AP: CM CBN
* జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలి: KCR
* తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా రానిచ్చారు.. బాలకృష్ణపై జగన్ ఫైర్
* నా కుమార్తె మాటలపై సీఎంకు క్షమాపణలు: కొండా సురేఖ
* ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత్ ఓటమి
* మళ్లీ తగ్గిన బంగారం ధరలు

News October 24, 2025

న్యూజిలాండ్‌పై విజయం.. సెమీస్‌కు భారత్

image

WWCలో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచులో టీమ్ ఇండియా DLS ప్రకారం 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ <<18085029>>340<<>> పరుగులు చేసింది. ఛేదనలో వర్షం కురవడంతో లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325గా నిర్దేశించారు. భారత బౌలర్లు కట్టడి చేయడంతో న్యూజిలాండ్ 271 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో టీమ్ ఇండియా సెమీస్ చేరింది.

News October 24, 2025

ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల

image

రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 10 నుంచి రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నట్లు TET కన్వీనర్ కృష్ణా రెడ్డి తెలిపారు. 9.30am నుంచి 12pm వరకు తొలి సెషన్, 2.30-5pm రెండో సెషన్ నిర్వహిస్తామన్నారు. రేపటి నుంచి నవంబర్ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. DEC 3న హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది JAN 19న ఫలితాలు వెలువడతాయని పేర్కొన్నారు.