News April 16, 2025
ఏపీకి అండగా ఉండండి: CM విజ్ఞప్తి

APకి కీలకమైన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానానికి నిధులు ఇవ్వాలని CM చంద్రబాబు 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. అమరావతిలో జాతీయ మ్యూజియం, విశాఖలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్, తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి నిధులు కోరారు. అమరావతి, తిరుపతి, విశాఖలను గ్రోత్ సెంటర్లుగా మార్చేందుకు గ్రాంట్లు, పోర్టులు, హార్బర్లు, లాజిస్టిక్ పార్కులు, ఎయిర్పోర్టులు నిర్మించేలా సాయానికి విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 19, 2025
వేమన పద్యం

ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన
కన్నదేమి నరుడు గ్రాసమునకు
తన్నులోను జూడ తమమెల్ల వీడును
విశ్వదాభిరామ వినుర వేమ.
భావం: ఉన్నచోటును విడిచి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూసుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది.
News April 19, 2025
ఆ హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చు: కూనంనేని

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చని MLA కూనంనేని సాంబ శివరావు అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో విమానాశ్రయం ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి డోలాయమానంలో ఉందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎవరికీ రుపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు.
News April 19, 2025
ఇలా చేస్తే కోటీశ్వరులు కావొచ్చు!

పెట్టుబడుల కోసం చాలా మార్గాలున్నా, సిప్(SIP) అనేది దీర్ఘకాలంలో మంచి లాభాలు ఇస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మంచి స్టాక్స్ను సెలెక్ట్ చేసుకొని నెలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టగలిగితే 15 ఏళ్లలో కోటి లేదా అంతకుమించి జమ చేసుకోవచ్చని తెలుపుతున్నారు. అయితే, మార్కెట్ల ఒడిదొడుకులు వల్ల స్వల్ప కాలంలో రాబడి ఉండదని, కనీసం పదేళ్లు కొనసాగిస్తామనే వారే SIP స్టార్ట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.