News March 30, 2025

సవతి తల్లి కర్కశత్వం.. పిల్లాడిని గోడకేసి కొట్టడంతో

image

AP: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మొదటి భార్య కవల కుమారులను రెండో భార్య లక్ష్మి తీవ్రంగా హింసించింది. గోడకేసి కొట్టడంతో తల పగిలి చిన్న కొడుకు కార్తీక్(6) మృతి చెందాడు. పెద్ద కుమారుడు ఆకాశ్‌కు రక్తం వచ్చేలా వాతలు పెట్టింది. ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో భర్త సాగర్, లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 14, 2025

పెట్టుబడుల్లో వెండే ‘బంగారం’

image

బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది వీటిని సేఫెస్ట్ ఆప్షన్‌గా భావిస్తూ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే గోల్డ్ కంటే సిల్వర్‌ ఎక్కువ రిటర్న్స్ ఇస్తోందన్న విషయం తెలుసా? గత ఐదేళ్లలో బంగారంపై 33.15%, వెండిపై అత్యధికంగా 37.23% లాభాలు వచ్చాయి. అదే సమయంలో సెన్సెక్స్‌‌ కేవలం 2.64% రిటర్న్స్ ఇవ్వగలిగింది. లాంగ్‌టర్మ్‌లో సిల్వర్, గోల్డ్ బెటర్ అని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

News October 14, 2025

‘ఇది ఆల్‌టైమ్ చెత్త ఫొటో’.. ట్రంప్ సెల్ఫ్ ట్రోలింగ్

image

టైమ్ మ్యాగజైన్ కవర్‌ పేజీపై ప్రచురించిన తన ఫొటో చెత్తగా ఉందంటూ US ప్రెసిడెంట్ ట్రంప్ సెల్ఫ్ ట్రోల్ చేసుకున్నారు. ‘నా గురించి మంచి కథనం రాశారు. కానీ ఫొటో మాత్రం వరస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్. నా జుట్టు కనిపించకుండా చేశారు. తలపై ఏదో చిన్న కిరీటం ఎగురుతున్నట్టు పెట్టారు. భయంకరంగా ఉంది. కింది నుంచి తీసే ఫొటోలు నాకిష్టం ఉండవు. ఇది సూపర్ బ్యాడ్ పిక్చర్. ఎందుకు ఇలా చేస్తున్నారు?’ అని అసహనం వ్యక్తం చేశారు.

News October 14, 2025

ఏపీ రౌండప్

image

* ఏపీ హైకోర్టుకు ముగ్గురు జడ్జిల బదిలీ.. గుజరాత్ HC నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ నుంచి జస్టిస్ డూండి రమేశ్, కోల్‌కతా నుంచి జస్టిస్ సుబేందు సమంత బదిలీ
* వైజాగ్‌లోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు మినీ రత్న హోదా
* కురుపాం ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌ అంతార్ సింగ్ ఆర్యకు YCP నేతల ఫిర్యాదు
* విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్ట్ టెండర్ల గడువు ఈ నెల 24 వరకు పొడిగింపు