News February 24, 2025
IT నుంచి AI దిశగా అడుగులు: గవర్నర్

AP: 2047నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నట్లు గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ చెప్పారు. ‘పెన్షన్లు రూ.4వేలకు పెంచాం. ఏడాదికి రూ.3సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం. పోలవరంను పట్టాలెక్కించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. IT నుంచి AI రివల్యూషన్ దిశగా అడుగులు వేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగింది. రూ.6.5లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం’ అని తెలిపారు.
Similar News
News December 29, 2025
NHIDCLలో 48 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (<
News December 29, 2025
గిల్ చాలా బద్ధకస్తుడు.. కోహ్లీలా ఆడలేడు: పనేసర్

టీమ్ఇండియా వన్డే & టెస్ట్ కెప్టెన్ గిల్ చాలా బద్ధకస్తుడని, కోహ్లీలా దూకుడుగా ఆడలేడని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ విమర్శించారు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయడం అతనికి భారమని అన్నారు. టెస్టుల్లో నిలదొక్కుకోవాలంటే దేశవాళీ క్రికెట్ బలోపేతం కావాలని సూచించారు. ప్లేయర్లు కేవలం IPL కాంట్రాక్టుల కోసమే ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కోహ్లీ లేకపోవడంతో జట్టులో ఆ తీవ్రత కనిపించడం లేదన్నారు.
News December 29, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.710 తగ్గి రూ.1,41,710కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.650 తగ్గి రూ.1,29,900 పలుకుతోంది. అటు కొద్ది రోజులుగా విపరీతంగా పెరిగిన వెండి ధరలు ఇవాళ దిగివచ్చాయి. కేజీ వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,81,000 పలుకుతోంది.


