News February 24, 2025

IT నుంచి AI దిశగా అడుగులు: గవర్నర్

image

AP: 2047నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం దిశగా అడుగులు వేస్తున్నట్లు గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ చెప్పారు. ‘పెన్షన్లు రూ.4వేలకు పెంచాం. ఏడాదికి రూ.3సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం. పోలవరంను పట్టాలెక్కించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. IT నుంచి AI రివల్యూషన్ దిశగా అడుగులు వేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగింది. రూ.6.5లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం’ అని తెలిపారు.

Similar News

News December 10, 2025

వివేకా హత్యకేసులో కోర్టు కీలక ఆదేశాలు

image

TG: వివేకా హత్యకేసులో పలు అంశాలపై రీ ఇన్వెస్టిగేషన్ చేయాలని CBIని నాంపల్లి కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు డైరెక్షన్‌లో కేసును మళ్లీ విచారించాలని సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు కోర్టు అనుమతులు ఇచ్చింది. A2 సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి కాల్ రికార్డింగుల ఆధారంగా దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.

News December 10, 2025

టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాలి.. TSUTF డిమాండ్

image

TG: నిన్న విద్యాశాఖ ప్రకటించిన పదో తరగతి ఎగ్జామ్స్ <<18515127>>షెడ్యూల్‌పై<<>> తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(TSUTF) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 7 పేపర్లను 35 రోజుల పాటు నిర్వహించడం సరికాదంది. అశాస్త్రీయంగా రూపొందించిన SSC టైమ్ టేబుల్‌ను వెంటనే మార్చాలని డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.

News December 10, 2025

ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న ‘స్ట్రోక్’ కేసులు.. ఎందుకంటే?

image

కొన్నేళ్లుగా 20-40 ఏళ్ల యువకుల్లో స్ట్రోక్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమని వైద్యులు పేర్కొన్నారు. ఐటీ నిపుణులు ఉన్నట్టుండి నాడీ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ‘అదుపు లేని రక్తపోటు, నిద్రలేమి, అధిక ఒత్తిడి, ధూమపానం, నిశ్చల జీవనశైలితో పాటు షుగర్ వంటివి ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు. యువతలో స్ట్రోక్ ఆరోగ్యాన్నే కాకుండా వారి కెరీర్, కుటుంబ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.