News August 4, 2024
తక్కువ రేట్లకే BSNL సేవలు అందేలా చర్యలు: పెమ్మసాని

AP: వచ్చే ఏడాది మార్చి నాటికి దేశమంతా BSNL 4G సేవలు అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 4500 టవర్ల ద్వారా నాణ్యమైన 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అతి తక్కువ రేట్లలో సేవలు అందించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందన్నారు. ప్రైవేట్ సంస్థల ధరల వల్ల ప్రజలు BSNL వైపు చూస్తున్నారని వివరించారు.
Similar News
News November 26, 2025
బిడ్డకు జన్మనిచ్చిన ‘బ్లూడ్రమ్’ ముస్కాన్.. DNA టెస్టుకు డిమాండ్

UP మీరట్లో ప్రియుడితో కలిసి భర్తను చంపి బ్లూడ్రమ్లో పాతేసిన <<16560833>>ముస్కాన్<<>> తాజాగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. భర్త సౌరభ్ పుట్టినరోజునే(NOV 24) బిడ్డ పుట్టడం గమనార్హం. దీంతో ఆ చిన్నారికి DNA టెస్టు నిర్వహించాలంటూ మృతుడి సోదరుడు రాహుల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెద్ద కూతురు విషయంలోనూ అతను పిల్ వేయగా తీర్పు వెలువడలేదు. వారిద్దరూ సౌరభ్ పిల్లలుగా తేలితే తామే పోషిస్తామని అతను చెబుతున్నాడు.
News November 26, 2025
ఉర్విల్ ఊచకోత.. 10 సిక్సులు, 12 ఫోర్లతో..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ కెప్టెన్ ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించారు. 31 బంతుల్లోనే శతకం బాదారు. మొత్తంగా 37 బంతుల్లో 10 సిక్సులు, 12 ఫోర్లతో 119* రన్స్ చేశారు. తొలుత సర్వీసెస్ జట్టు 20 ఓవర్లలో 182/9 స్కోర్ చేయగా, ఉర్విల్ ఊచకోతతో గుజరాత్ 12.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా T20లలో ఫాస్టెస్ట్ సెంచరీ ఉర్విల్ పేరుమీదనే ఉంది. 2024లో త్రిపురపై 28 బాల్స్లోనే శతకం చేశారు.
News November 26, 2025
చెట్టు కోసం 363 మంది ప్రాణాలు కోల్పోయారు!

రాజస్థాన్ రాష్ట్ర వృక్షమైన హేజ్రీ చెట్టు ఉనికి వెనుక వందల మంది ప్రాణత్యాగం ఉందనే విషయం తెలుసా? 1730లో జోధ్పూర్ రాజు అభయ్ సింగ్ ప్యాలెస్ నిర్మాణానికి కలప సేకరించాలని సైనికులను పంపారు. ఇది తెలుసుకున్న బిష్ణోయ్ కమ్యూనిటీ సైనికులను అడ్డుకుంది. చెట్టును కౌగిలించుకుని నరకొద్దని కోరింది. సైనికులు వినకుండా 363 మందినీ నరికేశారు. ఇది తెలుసుకున్న రాజు చలించి చెట్లను నరకొద్దని ఆదేశించడంతో ఆ చెట్టు బతికింది.


