News April 2, 2024

ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి: సురేశ్ రైనా

image

చారిత్రక ఘట్టమైన 2011 వరల్డ్ కప్‌ను భారత జట్టు గెలుచుకున్న క్షణాలను తలుచుకుంటే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ట్వీట్ చేశారు. అద్భుతమైన టీమ్‌తో మరిచిపోలేని జ్ఞాపకాలు అంటూ WC అందుకున్న ఫొటోలను షేర్ చేశారు. రైనా 2011 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఆ టోర్నీలో పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన రైనా.. సెమీస్‌లో పాకిస్థాన్‌పై గెలవడంలోనూ ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 19, 2026

బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్

image

పంతానికి పోయి బంగ్లాదేశ్ చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. ముస్తాఫిజుర్‌ను IPL నుంచి తప్పించారని భారత్‌లో WC మ్యాచులు ఆడమని పట్టుబట్టింది. తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ICC ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే తమను ఐర్లాండ్‌తో గ్రూప్స్ స్వాప్ చేయాలని కోరింది. దానిని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు తిరస్కరించింది. తమ షెడ్యూల్ ప్రకారమే మ్యాచులు ఆడతామని స్పష్టం చేసింది.

News January 19, 2026

నేడు మరోసారి CBI విచారణకు విజయ్

image

TVK చీఫ్ విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇవాళ మరోసారి ఢిల్లీలో CBI విచారణకు హాజరుకానున్నారు. నిన్న సాయంత్రమే ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. జనవరి 12న విజయ్ మొదటిసారి అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు దాదాపు 7 గంటలపాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. సంక్రాంతి నేపథ్యంలో విజయ్ కోరిక మేరకు తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. కరూర్ తొక్కిసలాటలో 41మంది చనిపోయిన విషయం తెలిసిందే.

News January 19, 2026

మహిళలు శంఖానాదం చేయకూడదా?

image

మన ధర్మశాస్త్రాల ప్రకారం మహిళలు శంఖం ఊదకూడదనే నియమం ఎక్కడా లేదు. శంఖానాదం ఆధ్యాత్మికంగా సానుకూలతను ఇస్తుంది. అయితే శంఖం ఊదేటప్పుడు నాభి భాగంపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది మహిళల గర్భాశయ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అందుకే పూర్వీకులు ఈ జాగ్రత్తను సూచించారు. గర్భిణీలు దీనికి దూరంగా ఉండటం ఉత్తమం. ఇది ఆరోగ్యపరమైన సూచనే తప్ప ఆంక్ష కాదు. శారీరక సామర్థ్యం ఉన్న మహిళలు నిరభ్యంతరంగా శంఖానాదం చేయవచ్చు.