News October 23, 2025
వరిలో కంపు నల్లి – నివారణకు సూచనలు

ఖరీఫ్ వరి పంటలో గింజ పాలు పోసుకొనే దశలో కంపు నల్లి ఆశించడం వల్ల గింజపై నల్లని మచ్చలు ఏర్పడి, గింజలు తాలుపోతాయి. నవంబరు వరకు దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బూడిద, ఆకుపచ్చ రంగులోని నల్లి పురుగులు పంటను ఆశిస్తాయి. వీటి వల్ల పొలంలో చెడు వాసన వస్తుంది. ఈ నల్లిని సాయంత్రం వేళ పొలంలో గమనించవచ్చు. వీటి నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5ml లేదా మలాథియాన్ 2ml కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.
Similar News
News February 9, 2026
పాక్ గొంతెమ్మ కోర్కెలు.. కుదరదన్న ICC!

T20WC: ఈ నెల 15న భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ICCకి కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. ‘భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్, IND-PAK-BAN మధ్య ట్రై సిరీస్, భారత్ వచ్చే ఏడాది బంగ్లాలో పర్యటించాలి’ అని కోరినట్లు సమాచారం. పాక్ గొంతెమ్మ కోర్కెలను ICC తిరస్కరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ‘అది మా పరిధి కాదు’ అని ICC సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.
News February 9, 2026
కోలుకుంటున్న శరద్ పవార్

తీవ్ర అస్వస్థతకు గురైన NCP చీఫ్ శరద్ పవార్ కోలుకుంటున్నారని ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డ ఆయనను ఇవాళ మధ్యాహ్నం పుణేలోని రుబీహాల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు 5 రోజుల యాంటీబయాటిక్స్ కోర్స్ సజెస్ట్ చేసినట్లు సుప్రియ వెల్లడించారు. ఇటీవల శరద్ పవార్ సోదరుడి కుమారుడు, MH Dy.CM అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
News February 9, 2026
‘సావర్కర్కు భారతరత్న’పై మాటల మంటలు

వీర్ సావర్కర్కు భారతరత్న ఇవ్వాలన్న RSS చీఫ్ మోహన్ భాగవత్ కామెంట్స్తో మరోసారి చర్చ మొదలైంది. అసలు ఆయన దేశానికి ఏం సేవ చేశారని ఆ బిరుదు ఇవ్వాలని కాంగ్రెస్, MIM ఘాటుగా ప్రశ్నించాయి. అటు భారతరత్న కంటే సావర్కర్ది ఎంతో పెద్ద స్థాయి అని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కామెంట్ చేశారు. సావర్కర్కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.


