News March 16, 2025
STN: జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏర్పాటు చేసిన సభ వేదిక వద్దకు సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వేదిక వద్ద ఏర్పాటు చేసిన జ్యోతిప్రజ్వల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 18, 2025
సూర్యాపేట: ప్రజావాణి కార్యక్రమానికి 62 దరఖాస్తులు

ప్రజవాణిలో సరైన రీతిలో అర్జీదారులకు సమాధానమిస్తూ పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 62 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి వచ్చే ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News March 18, 2025
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు వేగవంతం చేయండి: సూర్య

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం ఇంజనీరింగ్, హౌసింగ్, టిడ్కో విభాగాల వారితో మీటింగ్ నిర్వహించారు. ఎల్&టి ఇంజనీరింగ్ కంపెనీ వారికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు వేగవంతంగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని ప్రతినిధులకు తెలిపారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలన్నారు.
News March 18, 2025
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కమిషనర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి వహించారని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కౌన్సిల్ హాల్లో ప్రజల నుంచి వినుతులు స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదులలో ఎక్కువగా టౌన్ ప్లానింగ్ 46, ఇంజినీరింగ్ విభాగం నుంచి 24 ఫిర్యాదులు రాగా.. హెల్త్ శానిటేషన్ 4, ప్రాపర్టీ టాక్స్ 10, మంచినీటి సరఫరా 4.. మొత్తం 88 అప్లికేషన్లు వచ్చాయి.