News November 18, 2024
Stock Market: బేర్స్ జోరు.. బుల్స్ బేజారు

స్టాక్ మార్కెట్లు మార్నింగ్ సెషన్లో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మొదటి అరగంట పాటు బెంచ్ మార్క్ సూచీలు రిట్రేస్మెంట్ అవ్వకుండా నష్టాలవైపు పయనించాయి. అయితే సెన్సెక్స్ 77,000 పరిధిలో, నిఫ్టీ 23,350 పరిధిలో ఇప్పటికే రెండు సార్లు సపోర్టు తీసుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 459 పాయింట్ల నష్టంతో 77,127 వద్ద, నిఫ్టీ 130 పాయింట్ల నష్టంతో 23,401 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Similar News
News November 22, 2025
IIT హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.
News November 22, 2025
మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.


