News December 16, 2024
Stock Market: ఇద్దరూ అమ్మకాలకు దిగారు

దేశీయ స్టాక్ మార్కెట్లపై సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. DIIలు, FII/FPIలు పెట్టుబడుల ప్రవాహాన్ని తగ్గించారు. మంగళవారం DIIలు రూ.234 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అలాగే FII/FPIలు రూ.278 కోట్ల షేర్లను విక్రయించారు. గత సెషన్(డిసెంబర్ 13)లో మార్కెట్లు అనూహ్యంగా పుంజుకోవడంతో తాజాగా ఇన్వెస్టర్లు స్వ్కేర్ ఆఫ్ చేస్తున్నారు. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
Similar News
News January 6, 2026
‘రాజాసాబ్’ రన్ టైమ్ ఫిక్స్.. టికెట్ ధరలు పెరిగేనా?

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో రూపొందిన ‘రాజాసాబ్’ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా నిడివి 3 గంటల 9 నిమిషాలుగా పేర్కొంది. మరోవైపు సెన్సార్ సర్టిఫికెట్ రావడంతో టికెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు నిర్మాణ సంస్థ లేఖ రాసింది. దీనిపై <<18543073>>TG ప్రభుత్వం<<>> ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 9న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
News January 6, 2026
ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

HYDలోని <
News January 6, 2026
ఈ చేప ఖరీదు రూ.28కోట్లు!

టోక్యోలోని టొయోసు మార్కెట్లో నిర్వహించిన వేలంలో ఒక బ్లూఫిన్ ట్యూనా చేప రికార్డు ధర పలికింది. 243kgs బరువున్న ఈ చేపను సుమారు రూ.28Crకు ($3.2M) ఓ రెస్టారెంట్ యజమాని దక్కించుకున్నారు. జపాన్లోని ‘Oma’ తీరంలో దొరికిన ఇలాంటి చేపలు రుచికరంగా ఉంటాయని పేరుంది. అలాగే అక్కడి సంప్రదాయం ప్రకారం న్యూఇయర్ తొలి వేలంలో అత్యధిక ధరకు చేపను కొంటే అదృష్టమని భావిస్తారు. అందుకే వ్యాపారులు ఎంత ఖర్చయినా వెనకాడరు.


