News October 4, 2024
Stock Market: మళ్లీ నేలచూపులు

స్టాక్ మార్కెట్లు మళ్లీ నేలచూపులు చూశాయి. ప్రారంభ సెషన్లో Higher Highsతో దూసుకుపోయిన సూచీలు మధ్నాహ్నం 12.30 గంటలకు రివర్సల్ తీసుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 808 పాయింట్లు నష్టంతో 81,688 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల భారీ నష్టంతో 25,049 వద్ద స్థిరపడ్డాయి. ఒకానొక దశలో 25,485కు చేరుకున్న నిఫ్టీ ఒక్కసారిగా కుప్పకూలింది. 83,372కు చేరుకున్న తరువాత BSE సూచీలో కూడా అదే ప్యాటర్న్ కనిపించింది.
Similar News
News November 7, 2025
పూజకు ఏయే రత్నాలను ఉపయోగించాలి..?

‘సువర్ణ రజతం ముక్తా; రాజవర్తం ప్రవాలకం రత్న పంచక మాఖ్యాతం’ అంటే.. బంగారం, వెండి, ముత్యం, వజ్రపు శిల(రాజవర్తం), పగడం(ప్రవాలకం)లను పంచ రత్నాలుగా పరిగణించాలి. ఒకవేళ ఈ ఐదు రత్నాలు దొరకనట్లయితే ‘ఆభావే సర్వ రత్నానాం హేమ సర్వత్ర యోజయేత్’ అన్నట్లు.. వాటి స్థానంలో బంగారాన్ని మాత్రమే ఉపయోగించవచ్చు. అన్ని రత్నాలలోనూ ఉత్తమమైనది. సమస్త కార్యాలకు వినియోగించడానికి అర్హమైనది. అందుకే పసిడికంత ప్రాధాన్యం. <<-se>>#Pooja<<>>
News November 7, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు!

ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA పేర్కొంది. కోనసీమ, ప.గో, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. అటు తెలంగాణలో ఉ.8.30 గంటల వరకు అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురిసేందుకు స్వల్ప అవకాశముందని HYD IMD పేర్కొంది. తర్వాతి 6 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది.
News November 7, 2025
ఒక పూట భోజనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

హిందూ ధర్మంలో కొందరు కొన్ని వారాల్లో ఒక పూట భోజనం చేసే వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ వ్రతం వెనుక కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజూ ఒకపూటే తినడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.శరీరానికి విశ్రాంతి దొరికి, జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. ఫలితంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆయుష్షు, శక్తి పెరుగుతాయి. ఎక్కువ పూటలు తినడం అనారోగ్యానికి సంకేతం. అందుకే పరిపూర్ణ ఆరోగ్యం కోసం ఈ నియమాన్ని పాటించాలంటారు. <<-se>>#Aaharam<<>>


