News October 4, 2024
Stock Market: మళ్లీ నేలచూపులు

స్టాక్ మార్కెట్లు మళ్లీ నేలచూపులు చూశాయి. ప్రారంభ సెషన్లో Higher Highsతో దూసుకుపోయిన సూచీలు మధ్నాహ్నం 12.30 గంటలకు రివర్సల్ తీసుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 808 పాయింట్లు నష్టంతో 81,688 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల భారీ నష్టంతో 25,049 వద్ద స్థిరపడ్డాయి. ఒకానొక దశలో 25,485కు చేరుకున్న నిఫ్టీ ఒక్కసారిగా కుప్పకూలింది. 83,372కు చేరుకున్న తరువాత BSE సూచీలో కూడా అదే ప్యాటర్న్ కనిపించింది.
Similar News
News October 23, 2025
ఉద్యోగ ఒత్తిడి ప్రాణాంతకం: ప్రొఫెసర్

దీర్ఘకాలిక ఉద్యోగ ఒత్తిడి, టాక్సిక్ ఆఫీస్ కల్చర్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించి, అకాల మరణానికి కూడా దారితీయవచ్చని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. జెఫ్రీ పిఫెర్ హెచ్చరించారు. అధిక పని గంటలు, ఉద్యోగ భద్రత లేమి వంటి అంశాలు ఒత్తిడి సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. హానికరమైన ఉద్యోగంలో కొనసాగడం వ్యక్తి శ్రేయస్సుకు ప్రమాదమని ఈ అంశాన్ని ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా అభివర్ణించారు.
News October 23, 2025
పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

TG: టెన్త్ ఫైనల్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు తేదీలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ప్రకటించింది. OCT 30-NOV 13లోపు HMలకు ఫీజు చెల్లించాలని తెలిపింది. వాళ్లు ఆన్లైన్లో NOV 14లోపు ఫీజు చెల్లించాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18లోపు DEOలకు అందించాలని పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు, రూ.200తో DEC 2-11 వరకు, రూ.500 లేట్ ఫీజ్తో DEC 15-29 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.
News October 23, 2025
విశాఖ గ్రోత్ హబ్ పనులు మరింత వేగవంతం: CS

AP: విశాఖ గ్రోత్ హబ్, పూర్వోదయ పథకాలపై నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం సచివాలయంలో CS విజయానంద్తో భేటీ అయ్యారు. ఏపీలో ఓడరేవులున్నా ఒక కంటైనర్ మెగా పోర్టు అవసరముందని ఆయన సూచించారు. పూర్వోదయ స్కీమ్తో తీరప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. VSP గ్రోత్ హబ్ పనుల వేగవంతానికి ప్రత్యేకంగా ఇన్ఛార్జిని నియమించనున్నామని CS చెప్పారు. కేంద్రం నుంచి తగినన్ని నిధులు వచ్చేలా చూడాలని సీఈఓను కోరారు.


