News October 28, 2024
Stock Market: వరుస నష్టాలకు బ్రేక్
దీపావళికి ముందు దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం లాభాలు గడించాయి. నిఫ్టీ 158 పాయింట్లు ఎగసి 24,339 వద్ద, సెన్సెక్స్ 602 పాయింట్ల లాభంతో 80,005 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్ఈలో Maruti, Hdfc Bank, TechM, Kotak Bank, Axis Bank మినహా మిగిలిన 25 స్టాక్స్ లాభపడ్డాయి. NSEలో Shriram Fin 5% లాభపడగా, Coal India 3.76% నష్టపోయింది.
Similar News
News October 28, 2024
పబ్ల వద్ద ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించండి: హైకోర్టు
TG: రాష్ట్రంలో పబ్ల నిర్వహణపై హైకోర్టు కీలక సూచనలు చేసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఇతర ప్రాంతాల్లోని పబ్లకు నిబంధనలు విధించాలని ఏఏజీకి సూచించింది. బడాబాబుల పిల్లలు పబ్ల వద్ద హంగామా చేస్తున్నారని, ర్యాష్ డ్రైవింగ్తో ప్రాణాలు తీస్తున్నారని పేర్కొంది. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ప్రమాద నివారణకు చర్యలు తీసుకోవాలంది.
News October 28, 2024
దీపావళికి ఏ సినిమాకు వెళ్తున్నారు?
ఈసారి దీపావళికి బాక్సాఫీస్ వద్ద బడా హీరోల మోతలు లేవు. ‘క’, లక్కీ భాస్కర్, అమరన్, బఘీర వంటి విభిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. ‘క’ థ్రిల్లర్ నేపథ్యంలో, లక్కీ భాస్కర్ విభిన్న కథాంశంతో తెరకెక్కినట్లుగా కనిపిస్తున్నాయి. ‘అమరన్’ జవాన్ జీవిత కథ ఆధారంగా, బఘీర యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కాయి. వీటితో పాటు భూల్ భులయ్యా-3, జీబ్రా వంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో మీరు ఏ సినిమాకు వెళ్తున్నారు?
News October 28, 2024
సచివాలయ భద్రతా సిబ్బందికి CSO వార్నింగ్
TG: సచివాలయ భద్రతా సిబ్బందికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్(CSO) హెచ్చరికలు జారీ చేశారు. సిబ్బంది కదలికలు, సోషల్ మీడియాపై నిఘా ఉందని ప్రకటనలో తెలిపారు. పోలీసులను రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకమైన పోస్టులను లైక్, షేర్ చేయవద్దన్నారు. ఏదైనా తప్పు జరిగినట్లు గుర్తిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.