News August 27, 2024

Stock Market: ఫ్లాట్‌గా ముగిశాయి

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. గ‌త సెష‌న్‌లో అమెరికా స్టాక్ మార్కెట్లు న‌ష్టాల బాట‌ప‌ట్ట‌డంతో దేశీయ మార్కెట్లలో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడ్డారు. నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 25,017 వ‌ద్ద స్థిర‌ప‌డింది. సెన్సెక్స్ 13 పాయింట్లు లాభ‌ప‌డి 81,711 వ‌ద్ద నిలిచింది. సోమవారం నిఫ్టీ చేరుకున్న25,000 పాయింట్ల మార్క్‌ను ఈ రోజు కూడా నిలుపుకోవ‌డం గ‌మ‌నార్హం.

Similar News

News April 2, 2026

పింపుల్స్ ఎందుకొస్తాయి?

image

మొటిమలకు ప్రధాన కారణం శరీరంలో ఇన్సూలిన్ పెరగడమని వైద్యులు చెబుతున్నారు. ‘కూల్‌డ్రింక్స్, బిస్కెట్లు, వైట్ బ్రెడ్, న్యూడిల్స్ వంటివి ఇన్సూలిన్ స్థాయిని పెంచి, ఆండ్రోజెన్ ఉత్పత్తికి దారి తీస్తాయి. ఈ ఆండ్రోజెన్ చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేయడంతో బాక్టీరియా పెరిగి మొటిమలు వస్తాయి. వాల్‌నట్స్, అవిసె, గుమ్మడి గింజలు, చేపలు, పాలకూర, క్యారెట్లు, టమాటా చర్మాన్ని రక్షిస్తాయి’ అని తెలిపారు.

News April 2, 2026

నేడు రాజ్యసభకు అమరావతి బిల్లు

image

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు నిన్న లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లాంఛనమే కానుంది. అనంతరం బిల్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు వెళ్తుంది. ఆమె ఆమోదముద్ర వేయగానే చట్ట రూపం దాలుస్తుంది. దీంతో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోనుంది.

News April 2, 2026

ఆర్టెమిస్-2: చంద్రుడి కక్ష్యలోకి స్మార్ట్‌ఫోన్లు..

image

NASA చేపట్టిన ఆర్టెమిస్-2 <<19542665>>యాత్ర<<>> రికార్డులు సృష్టిస్తోంది. ఇది అపోలో-13 కంటే 3,345 మైళ్లు ఎక్కువ దూరం ప్రయాణించనుంది. అలాగే చంద్రుడి కక్ష్యలోకి వెళ్తున్న తొలి మహిళగా క్రిస్టినా కోచ్ చరిత్రకెక్కనున్నారు. రెండు మినీ వ్యాన్ల పరిమాణంలో ఉండే ఓరియన్ నౌకలో నలుగురు వ్యోమగాములు తమ వెంట స్మార్ట్‌ఫోన్‌లు తీసుకెళ్తుండటం విశేషం. 10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో వీరు నింగి నుంచి సూర్య గ్రహణాన్ని వీక్షించనున్నారు.