News January 3, 2025
Stock Market: నష్టాల్లోకి.. పార్టీ అయిపోయింది

స్టాక్ మార్కెట్లు నష్టాలబాటపట్టాయి. గరిష్ఠాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో Sensex 720 పాయింట్లు నష్టపోయి 79,223 వద్ద, నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 24,004 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం నుంచి మిడ్ సెషన్ వరకు 2 సూచీల్లో బేర్స్ ర్యాలీ జరిగింది. Niftyలో 24,000 పరిధిలో, Sensexలో 79,250 వద్ద సపోర్ట్ లభించడంతో సూచీలు కొంతమేర కోలుకున్నాయి. IT స్టాక్స్ అత్యధికంగా 1.41% నష్టపోయాయి.
Similar News
News February 7, 2026
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

నేపాల్ యాక్టర్ సునీల్ థాపా(68) కన్నుమూశారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో కాఠ్మాండూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 40 ఏళ్ల కెరీర్లో 300కి పైగా నేపాలీ, బాలీవుడ్, భోజ్పురి సినిమాల్లో నటించారు. హిందీలో ‘మేరీ కోమ్’, తెలుగులో ‘మిరాయ్’ మూవీలోనూ కనిపించారు. ఆయన మృతిపై సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News February 7, 2026
దేశంలో ముస్లిం జనాభా హిందువులను దాటదు: అసదుద్దీన్

దేశంలో హిందూ జనాభాను ముస్లింలు ఎప్పటికీ అధిగమించలేరని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ముస్లిం జనాభా స్టెబిలైజ్ అవుతుందన్నారు. ‘20 ఏళ్ల తర్వాత వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. కానీ ద్రవ్యోల్బణం, ఇతర అంశాలపై ఆలోచించకుండా ముస్లిం జనాభా ఎక్కువవుతోందని గతంలో కొందరు అన్నారు. వృద్ధుల సంఖ్య పెరిగితే దేశంపై ఎంత ప్రభావం పడుతుందనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. పిల్లల్ని కనాలని చెబుతున్నారు’ అని విమర్శించారు.
News February 7, 2026
నెదర్లాండ్స్.. ఓడినా వణికించింది!

T20 WCలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన <<19075448>>తొలి మ్యాచ్<<>>లో నెదర్లాండ్స్ చివరి దాకా పోరాడింది. ఒకానొక దశలో గెలుపు దిశగా సాగింది. పాక్ 7 వికెట్లు కూల్చి 12 బంతుల్లో 29 పరుగులు కొట్టాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. కానీ 19వ ఓవర్లో ఒత్తిడికి గురైంది. ఒక క్యాచ్ కూడా మిస్ చేసుకుంది. ఫహీమ్ అష్రఫ్ ధాటికి 24 పరుగులు సమర్పించుకుంది. ఇదే మ్యాచ్ను మలుపుతిప్పింది. ఓడినా సరే పాక్కు ముచ్చెమటలు పట్టించింది.


