News January 3, 2025
Stock Market: నష్టాల్లోకి.. పార్టీ అయిపోయింది

స్టాక్ మార్కెట్లు నష్టాలబాటపట్టాయి. గరిష్ఠాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో Sensex 720 పాయింట్లు నష్టపోయి 79,223 వద్ద, నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 24,004 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం నుంచి మిడ్ సెషన్ వరకు 2 సూచీల్లో బేర్స్ ర్యాలీ జరిగింది. Niftyలో 24,000 పరిధిలో, Sensexలో 79,250 వద్ద సపోర్ట్ లభించడంతో సూచీలు కొంతమేర కోలుకున్నాయి. IT స్టాక్స్ అత్యధికంగా 1.41% నష్టపోయాయి.
Similar News
News November 13, 2025
టెర్రర్ మాడ్యూల్.. మొహియుద్దీన్ నివాసంలో తనిఖీలు

ఉగ్ర లింకుల నేపథ్యంలో హైదరాబాద్లో గుజరాత్ ATS సోదాలు నిర్వహించింది. రాజేంద్రనగర్లోని డా.మొహియుద్దీన్ నివాసంలో తనిఖీలు చేసి 3 రకాల లిక్విడ్లను స్వాధీనం చేసుకుంది. ఆయిల్ మెషీన్తో పాటు కొన్ని పుస్తకాలు సీజ్ చేసింది. జైషే మహ్మద్ సానుభూతిపరుడు మొహియుద్దీన్ ఆముదం గింజల వ్యర్థాల నుంచి రెసిన్ అనే విషాన్ని తయారుచేశాడు. దానితో వేలాది మందిని చంపాలని ప్లాన్ చేశాడు. ఈక్రమంలోనే ఇటీవల అతడిని అరెస్ట్ చేశారు.
News November 13, 2025
రాష్ట్రంలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఇవాళ తెల్లవారుజామున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్లోని సిర్పూర్లో కనిష్ఠంగా 7.1, తిర్యానీలో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇక HYD శివార్లలోని ఇబ్రహీంపట్నంలో 11.5, శేరిలింగంపల్లి(HCU)లో 11.8, రాజేంద్రనగర్లో 12.9, మారేడ్ పల్లిలో 13.6 డిగ్రీల కనిష్ఠానికి పడిపోయినట్లు పేర్కొన్నారు. రాబోయే 4-5 రోజుల్లో చలిగాలులు మరింత పెరుగుతాయని హెచ్చరించారు.
News November 13, 2025
ALERT: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?

ఢిల్లీ పేలుడులో ‘సెకండ్ హ్యాండ్ i20 కారు’ కీలకంగా మారింది. ఇలాంటి కేసుల్లో ఇరుక్కోకూడదంటే కొన్ని <<7354660>>జాగ్రత్తలు<<>> తీసుకోవాలి. కారు నంబర్పై కేసులు, ఛలాన్లతో పాటు ఫినాన్స్ పెండింగ్ ఉందేమో చూడాలి. ముఖ్యంగా అన్ని డాక్యూమెంట్లు ఉండాలి. ఆ వాహనం ఆధార్తో లింకై ఉండాలి. నేరుగా కాకుండా థర్డ్ పార్టీ ద్వారా కొంటే ఆ బాధ్యత వారిపైనా ఉంటుంది. కొన్నా, అమ్మినా RTOలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ తప్పనిసరి.


