News September 4, 2024

Stock Market: నష్టాల్ని తగ్గించుకున్న సూచీలు

image

భారీ పతనం నుంచి స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. సూచీలు మోస్తరు నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం 180 పాయింట్లు పతనమైన నిఫ్టీ 81 పాయింట్ల నష్టంతో 25,198 వద్ద క్లోజైంది. 600 పాయింట్ల పతనం నుంచి కోలుకున్న సెన్సెక్స్ 202 పాయింట్లు ఎరుపెక్కి 82,384 వద్ద స్థిరపడింది. ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, HUL, అల్ట్రాటెక్ సెమ్, సన్ ఫార్మా టాప్ గెయినర్స్. విప్రో, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, హిందాల్కో, LTIM టాప్ లూజర్స్.

Similar News

News January 25, 2026

మీరు చదివిన స్కూల్ ఇప్పుడు ఉందా..?

image

మనం చదివిన స్కూల్, కాలేజ్ ఎప్పటికీ మధుర జ్ఞాపకాలే. కానీ ప్రైవేట్లో చదివిన చాలామంది స్కూళ్లు, కాలేజెస్ ఇప్పుడు లేవు. పేరు, మేనేజ్మెంట్ మారడం, ఆ బిల్డింగ్‌లో మరొకటి కొనసాగడం సహా కొన్ని చోట్లయితే అసలు ఆ నిర్మాణాలే లేవు. ఇంకొందరికైతే స్కూల్ to కాలేజ్ ఏవీ లేవు. ఆ డేస్ గురించి ఫ్రెండ్స్, ఫ్యామిలీ చిట్‌చాట్లో ఈ మధ్య ఎక్కువగా ఇవి విన్పిస్తున్నాయి. ఇంతకీ మీరు చదివినవి ఇప్పుడున్నాయా? కామెంట్ చేయండి.

News January 25, 2026

చిరంజీవి-బాబీ మూవీ.. టైటిల్ ఇదేనా?

image

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ టైటిల్‌పై SMలో టాక్ నడుస్తోంది. ‘కాకా’ అనే పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తారని, కుమార్తెగా కృతి శెట్టి కనిపిస్తారని సమాచారం. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో చిరుకు బాబీ హిట్ ఇవ్వడం తెలిసిందే.

News January 25, 2026

భర్తపైనే ఎదురుకేసు పెట్టి.. ఆస్తి రాయించుకుని..

image

AP: గుంటూరు(D)లో <<18938678>>భర్తను భార్య చంపిన<<>> కేసులో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. గోపీతో తన భార్య మాధురి వివాహేతర బంధం గురించి శివనాగరాజుకు తెలిసి కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో CC కెమెరాలు పెట్టాలని భర్త భావించాడు. దీంతో అతడి హత్యకు మాధురి ప్లాన్ చేసింది. భర్తపై PSలో ఫిర్యాదు చేసి, పుట్టింటి వారు కట్నంగా ఇచ్చిన ఆస్తిని తన పేరుతో రాయించుకుంది. తర్వాత గోపీ, ఓ RMPతో కలిసి హత్య చేసిందని తెలుస్తోంది.