News September 17, 2024
Stock Market: ఇన్వెస్టర్లు జాగ్రత్తపడ్డారు

US ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడ్డారు. సెన్సెక్స్ రోజంతా 82,866 – 83,153 మధ్య కన్సాలిడేట్ అవుతూ చివరికి 90 పాయింట్ల లాభంతో 83,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 25,418 వద్ద నిలిచింది. హీరో మోటార్స్, బజాజ్ ఆటో, Airtel టాప్ గెయినర్స్. టాటా మోటార్స్, ఐచర్, టాటా స్టీల్, కోల్ ఇండియా, JSW Steel టాప్ లూజర్స్.
Similar News
News January 25, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్లో పోస్టులు

<
News January 25, 2026
ఆదివారం రోజున ఈ పనులు చేస్తున్నారా?

ఆదివారం, సప్తమి రోజుల్లో కొన్ని పనులు చేస్తే సూర్య దోషం కలగవచ్చని పండితులు చెబుతున్నారు. ‘మద్యమాంసాలు ముట్టకూడదు. క్షురకర్మ చేసుకోకూడదు. తలస్నానానికి నూనె వాడకూడదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం అశుభం. తోలు వస్తువుల వాడకాన్ని తగ్గించాలి. సూర్యాస్తమయానికి ముందే తినేయాలి. ఆ తర్వాత చేసే భోజనం ఆరోగ్యపరంగా మంచిది కాదు. ఈ నియమాలు అతిక్రమిస్తే దారిద్ర్యం, అనారోగ్యం, కంటి సమస్యలు వచ్చే అవకాశముంది’ అంటున్నారు.
News January 25, 2026
థాంక్యూ ఇండియా: ఇరాన్

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో తమకు అండగా నిలిచినందుకు ఇండియాకు ఇరాన్ థాంక్స్ చెప్పింది. ‘మాకు మద్దతు ఇచ్చినందుకు ఇండియాకు కృతజ్ఞతలు. న్యాయం, జాతీయ సార్వభౌమత్వం విషయంలో ఆ దేశ వైఖరికి ఇది నిదర్శనం’ అని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫథాలీ అన్నారు. కాగా శాంతియుత నిరసనలను ఇరాన్ ప్రభుత్వం అణచేస్తోందంటూ UNHRC 39వ ప్రత్యేక సెషన్లో ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది.


