News October 24, 2024

STOCK MARKET: జంకుతున్న ట్రేడర్స్

image

దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్సే అందాయి. దీంతో ఇన్వెస్టర్లు దూకుడుగా పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు. సెన్సెక్స్ 80,151 (69), నిఫ్టీ 24,441 (6) వద్ద చలిస్తున్నాయి. FMCG, IT, METAL సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంక్, ఫైనాన్స్ సూచీలు పుంజుకున్నాయి. HUL, హిందాల్కో, SBI LIFE, నెస్లే, AIRTEL టాప్ లూజర్స్. గ్రాసిమ్, కోల్ఇండియా ఎగిశాయి.

Similar News

News October 24, 2024

సుందర్‌కు చోటు: టీమ్ఇండియా భయపడిందన్న గవాస్కర్

image

NZతో రెండో టెస్టులో వాషింగ్టన్ సుందర్‌కు చోటివ్వడం టీమ్‌ఇండియా భయానికి సంకేతమని సునిల్ గవాస్కర్ అన్నారు. అందుకే కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకోలేదన్నారు. ‘సాధారణంగా గాయాల బెడద ఉంటే తప్ప జట్టులోంచి ముగ్గుర్ని తప్పించరు. బ్యాటింగ్ డెప్త్‌పై ఆందోళనతోనే కుల్‌దీప్‌ను కాదని సుందర్‌ను తీసుకున్నారు. నిజమే, NZలో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. కానీ కుల్‌దీప్ వారికి దూరంగా బంతిని టర్న్ చేయగలరు’ అని వివరించారు.

News October 24, 2024

అవినాశ్ రెడ్డిని విమర్శిస్తున్నారని కేసు పెట్టడం ఏంటి జగన్?: TDP

image

AP: అవినాశ్ రెడ్డిని విమర్శించడం మానేస్తేనే షర్మిలకు ఆస్తి రాసిస్తానంటూ YS జగన్ బ్లాక్‌మెయిల్ చేశారని TDP ట్వీట్ చేసింది. ‘నీ గురించి రాజకీయంగా విమర్శించవద్దని అన్నావు ఓకే. కానీ మధ్యలో అవినాశ్ ఎందుకు వచ్చాడు? అవినాశ్‌ను విమర్శిస్తున్నారని సొంత తల్లి, చెల్లిపై కేసు పెట్టడం ఏంటి? బాబాయ్ హత్యలో నిందితుడైన అతని గురించి మాట్లాడితే నీ ఇంటి నుంచి జరిగిన హత్య మంత్రాంగం బయటపడుతుందని భయమా?’ అని పేర్కొంది.

News October 24, 2024

సాక్ష్యాలివిగో.. YCP సంచలన ట్వీట్

image

AP: ఇవాళ మ.12గంటలకు <<14432304>>‘ట్రూత్ బాంబ్’<<>> అంటూ ఉత్కంఠ రేకెత్తించిన YCP చెప్పినట్లుగానే సరిగ్గా 12గంటలకు ట్వీట్ చేసింది. ‘మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్‌ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్‌ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!’ అంటూ కొన్ని పత్రాలను జత చేసింది.