News December 10, 2024

Stock Market: చివర్లో రికవరీ

image

దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగ‌ళ‌వారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉద‌యం నుంచి మ‌ధ్నాహ్నం వ‌ర‌కు Lower Lowsతో నేల‌చూపులు చూసిన సూచీలకు కీల‌క ద‌శ‌లో సపోర్ట్ లభించింది. అనంతరం రివ‌ర్స‌ల్ తీసుకోవ‌డంతో ప్రారంభ న‌ష్టాల‌ నుంచి రికవర్ అయ్యాయి. చివ‌రికి సెన్సెక్స్ 1.59 పాయింట్ల లాభంతో 81,510 వ‌ద్ద‌, నిఫ్టీ 9 పాయింట్ల న‌ష్టంతో 24,610 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. రియ‌ల్టీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు రాణించాయి.

Similar News

News September 22, 2025

అక్టోబర్ తొలివారంలో బిహార్ ఎన్నికల షెడ్యూల్?

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ తొలి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. 2 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు EC సిద్ధమవుతోంది. ఈ ఎన్నికను BJP, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. NDAలో కీలకంగా ఉన్న అధికార జేడీయూకు BJP మద్దతు ఇస్తోంది. ఇప్పటికే నిధుల కేటాయింపులోనూ కేంద్రం బిహార్‌కు పెద్దపీట వేస్తోంది. అటు INC నేత రాహుల్ గాంధీ SIRకు వ్యతిరేకంగా యాత్ర చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నారు.

News September 22, 2025

నవరాత్రి ఉత్సవాలు షురూ..

image

దేశవ్యాప్తంగా దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా విజయవాడలో తొలిరోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీగా దర్శనమివ్వనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రేపటి నుంచి ఉ.4 గంటలకే అనుమతిస్తారు. అటు గ్రామాల్లోనూ దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించారు.

News September 22, 2025

ఎల్లుండి విజయవాడకు సీపీ రాధాకృష్ణన్

image

AP: నూతన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఎల్లుండి విజయవాడలో పర్యటించనున్నారు. తొలుత ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం పున్నమిఘాట్‌లో జరిగే ‘విజయవాడ ఉత్సవ్’లో పాల్గొంటారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయం తెలిపింది. ఇటీవల సీపీ రాధాకృష్ణన్‌ను కలిసిన ఎంపీ, విజయవాడ ఉత్సవ్‌కు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆ మేరకు ఆయన విచ్చేయనున్నారు.