News October 31, 2024
Stock Market: మళ్లీ నష్టాలు

దీపావళికి ముందు ఐటీ రంగ షేర్లు 3 శాతం పతనమవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలబాట పట్టాయి. సెన్సెక్స్ 553 పాయింట్ల నష్టంతో 79,389 వద్ద, నిఫ్టీ 135 పాయింట్ల నష్టంతో 24,205 వద్ద స్థిరపడ్డాయి. Tech Mahindra, HCL Technologies, Infosys, TCS, Wipro భారీగా నష్టపోయాయి. బేర్ మార్కెట్లోనూ Cipla, L&T, Dr Reddy’s Labs, Hero Motocorp, ONGC లాభపడ్డాయి.
Similar News
News October 13, 2025
పాకిస్థాన్కు అఫ్గాన్ షాక్!

<<17987289>>వివాదం<<>> వేళ పాక్కు అఫ్గాన్ షాక్ ఇచ్చింది. తమ దేశంలో పర్యటిద్దామనుకున్న డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖవాజా, ISI చీఫ్ ఆసిమ్ మాలిక్ వీసాలను రిజెక్ట్ చేసింది. అటు పాక్తో జరగనున్న టీ20 మ్యాచ్ను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పాక్, లంక, అఫ్గాన్ త్వరలో ట్రై సిరీస్ ఆడాల్సి ఉంది. మరోవైపు భారత్తో సంబంధాలను తాలిబన్ ప్రభుత్వం పునరుద్ధించుకుంటోంది. ఆ దేశ మంత్రి ముత్తాఖీ IND పర్యటనలో ఉన్నారు.
News October 13, 2025
పిల్లలకు వాడకూడని 3 వస్తువులు

మూడేళ్లలోపు పిల్లల శరీరం అతి సున్నితమైంది. కొందరు పేరెంట్స్ వారికి హార్డ్ బ్రష్తో పళ్లు తోముతుంటారు. ఇది వారి మృదువైన చిగుళ్లకు హాని కలిగిస్తుంది. ఇక స్నానం చేయించేటప్పుడు స్క్రబ్బర్తో రుద్దడాన్ని చిన్నారుల సున్నితమైన చర్మం తట్టుకోలేదు. తలస్నానం చేయించాక హెయిర్ డ్రయ్యర్ వినియోగం వల్ల వారి కుదుళ్లు దెబ్బతిని త్వరగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలా మీరు చేయిస్తున్నట్లయితే వెంటనే ఆపేయండి. SHARE IT
News October 13, 2025
LED స్క్రీన్లో వేములవాడ రాజన్న దర్శనం

TG: వేములవాడ అభివృద్ధి పనుల నేపథ్యంలో LED స్క్రీన్ ద్వారా రాజరాజేశ్వర స్వామి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్జిత సేవలను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మేడారం జాతర సందర్భంగా భక్తులు ఇక్కడికీ పెద్ద సంఖ్యలో తరలివస్తారని వెల్లడించారు. తొలుత భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక <<17983463>>ఏర్పాట్లు<<>> చేసిన విషయం తెలిసిందే.