News October 31, 2024
Stock Market: మళ్లీ నష్టాలు

దీపావళికి ముందు ఐటీ రంగ షేర్లు 3 శాతం పతనమవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలబాట పట్టాయి. సెన్సెక్స్ 553 పాయింట్ల నష్టంతో 79,389 వద్ద, నిఫ్టీ 135 పాయింట్ల నష్టంతో 24,205 వద్ద స్థిరపడ్డాయి. Tech Mahindra, HCL Technologies, Infosys, TCS, Wipro భారీగా నష్టపోయాయి. బేర్ మార్కెట్లోనూ Cipla, L&T, Dr Reddy’s Labs, Hero Motocorp, ONGC లాభపడ్డాయి.
Similar News
News November 28, 2025
ఎన్నికల వేళ రౌడీషీటర్లపై కన్నేయండి: జిల్లా ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా పెంచాలని కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. గురువారం నేర సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మట్కా, బెట్టింగ్, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, శక్తి టీమ్స్ పనితీరు మెరుగుపరచాలని సూచించారు. రోడ్డు భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
News November 28, 2025
మేడారంలో వనదేవతల దర్శనానికి 8 క్యూలైన్లు: ములుగు ఎస్పీ

మేడారం వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అదనంగా మరో ఐదు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నామని ములుగు ఎస్పీ సుధీర్ కేకన్ తెలిపారు. మొత్తం ఎనిమిది క్యూలైన్ల ద్వారా భక్తులను గద్దెల వద్దకు అనుమతిస్తామన్నారు. 3 గేట్ల ద్వారా బయటకు పంపిస్తామని తెలిపారు. ఈసారి మహా జాతరకు 1.50 కోట్ల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు. తల్లుల దర్శనానికి అందరికీ ఒకటే నిబంధన అమలు చేస్తామన్నారు.
News November 28, 2025
VKB: టీఈ పోల్ యాప్ను వినియోగించుకోండి: కలెక్టర్

టీఈ పోల్ మొబైల్ యాప్ ద్వారా కావాలసిన సమాచారాన్ని పొందవచ్చునని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు వివరాలను మొబైల్ యాప్ ద్వారా ఓటర్ స్లిప్ ను పొందవచ్చునని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వివరాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదును కూడా యాప్ ద్వారా తెలియచేయవచ్చునని తెలిపారు.


