News August 26, 2024
Stock Market: 25,000 మార్క్ దాటిన నిఫ్టీ

అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ బెంచ్ మార్క్ సూచీలు సోమవారం బలమైన బుల్ ట్రెండ్ను ప్రదర్శించాయి. సెన్సెక్స్ 611 పాయింట్ల లాభంతో 81,698, నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 25,010 వద్ద స్థిరపడ్డాయి. హిందాల్కో, NTPC, HCL టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. అపోలో హాస్పిటల్స్, హీరో మోటొకార్ప్, అదానీ పోర్ట్స్, ఐచర్, మారుతీ సుజుకీ నష్టపోయాయి.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


