News August 23, 2024
Stock Market: ఆఖరి సెషన్లో అంతంత మాత్రమే

ఈ వారం ఆఖరి సెషన్లో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. 81,165 వద్ద మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగి 81,086 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 24,823 వద్ద క్లోజైంది. నిఫ్టీలో 22 కంపెనీలు లాభపడగా 28 నష్టపోయాయి. బజాజ్ ఆటో, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా టాప్ గెయినర్స్. ఎల్టీఐ మైండ్ట్రీ, విప్రో, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, టైటాన్ నష్టపోయాయి.
Similar News
News January 29, 2026
పేరు మార్చుకోనున్న సమంత?

హీరోయిన్ సమంత మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత భార్య ఇంటి పేరు మారుతుంది. భర్త ఇంటి పేరు భార్య పేరు ముందు పెట్టుకుంటారు. సమంత కూడా రాజ్ నిడిమోరు ఇంటిపేరును చేర్చుకోనున్నట్టు తెలుస్తోంది. SM అకౌంట్లతోపాటు ప్రస్తుతం చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ టైటిల్స్లోనూ ‘సమంత నిడిమోరు’ పేరును అభిమానులకు పరిచయం చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
News January 29, 2026
అమరావతి రైతులకు మిక్స్డ్ యూజ్ రిటర్నబుల్ ప్లాట్లు!

AP: అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్లో రైతులకు మిక్స్డ్ యూజ్ రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలిదశలో వాణిజ్య, నివాస ప్లాట్లు వేర్వేరుగా ఇచ్చారు. దీనివల్ల ఒకే పార్సిల్గా కాకుండా చిన్న ముక్కలుగా మారి కేటాయింపు ఇబ్బంది అయ్యింది. ఈసారి ల్యాండ్ పార్సిల్ ఒకేచోట ఉండేలా చూస్తున్నారు. మిక్స్డ్ యూజ్ నిర్మాణాలకు ఫ్లోర్ స్పేస్ ఇండెక్సూ కీలకం కావడంతో దానిపైనా ఆలోచిస్తున్నారు.
News January 29, 2026
SBI 2273 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<


