News August 7, 2024
Stock Market: లాభాలతో ప్రారంభం

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ప్రీ ఓపెన్ మార్కెట్ను లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 969 పాయింట్లు, నిఫ్టీ 296 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 537 పాయింట్ల లాభాలతో ప్రారంభమయ్యాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆయిల్ & గ్యాస్ రంగ షేర్లు బుల్లిష్గా ఉన్నాయి. సెన్సెక్స్ నిన్న ప్రారంభ సెషన్లో వెయ్యి పాయింట్లు సాధించినా ట్రేడింగ్ ముగిసే సమయానికి 166 పాయింట్లు నష్టపోయింది.
Similar News
News January 6, 2026
ఖమ్మం: ఏప్రిల్లో రెండో విడత ‘ఇందిరమ్మ’ ఇళ్లు

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి విడతలో మంజూరైన 16,523 ఇళ్లలో ఇప్పటికే 7,341 ఇళ్లు స్లాబ్ దశకు చేరుకోగా, 324 ఇళ్లు పూర్తికావచ్చాయి. అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతోంది. వచ్చే ఏప్రిల్లో రెండో విడత మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది. పాతగృహలక్ష్మి ఇళ్లను సైతం ఇందిరమ్మ పథకంలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని అధికారులు తెలిపారు.
News January 6, 2026
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మరోసారి ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరారు. ఆమె తీవ్ర దగ్గుతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సోనియాను అబ్జర్వేషన్లో ఉంచినట్లు పేర్కొన్నాయి. అయితే ప్రమాదమేమీ లేదని, రెగ్యులర్ చెకప్లో భాగంగానే ఆస్పత్రికి వెళ్లినట్లు వెల్లడించాయి.
News January 6, 2026
నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ (<


