News February 19, 2025
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 132 పాయింట్లు తగ్గి 75,835 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు తగ్గి 22,890 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీ టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతుండగా HDFC బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
Similar News
News November 17, 2025
ఆవు పొదుగులోనే అరవై ఆరు పిండివంటలూ..

ఆవు పాలు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల నుంచి అనేక రకాలైన వంటకాలు, పిండి వంటలను తయారు చేయవచ్చు. ఈ సామెత ఆవు పాలు, వాటి ఉత్పత్తుల యొక్క గొప్పతనాన్ని, అవి అందించే విస్తృతమైన ప్రయోజనాలను, వంటకాల వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. ఆవు పాలు ఎన్నో రకాలైన రుచికరమైన, సాంప్రదాయకమైన ఆహార పదార్థాలకు మూలాధారమని దీని అర్థం.
News November 17, 2025
శివుడే వైరాగి.. మరి మనకు సంపదను ప్రసాదించగలడా?

శివుడే వైరాగి. పైగా కైలాసంలో ఉంటాడు. పులి చర్మాన్ని ధరిస్తాడు. మరి ఆయన సంపదలను ఇవ్వగలడా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ ఆ సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆయనే మోక్షం, సంతోషం అనే శాశ్వత సంపదలకు అధిపతి. ఇక అష్టైశ్వర్యాలకు అధిపతి అయిన కుబేరుడు, శివుని ఆశీస్సులతోనే ఆ స్థానాన్ని పొందాడు. ప్రశాంతత అనే సంపదకు మూలమైన చంద్రుణ్ని తలపై ధరించి అలా కూడా మనల్ని అనుగ్రహిస్తున్నాడు.
News November 17, 2025
టెరిటోరియల్ ఆర్మీలోకి మహిళలు!

టెరిటోరియల్ ఆర్మీలోకి మహిళలను చేర్చుకునే అంశాన్ని ఆర్మీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని బెటాలియన్లలో నియామకాలు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక ఫలితాలను విశ్లేషించిన తర్వాత ఇతర బెటాలియన్లలోనూ నియమించుకునే అవకాశం ఉంది. ఆర్మ్డ్ ఫోర్సెస్లో నారీ శక్తి పెరగాలన్న ప్రభుత్వ ప్రయత్నాల నేపథ్యంలో ఈ దిశగా అడుగులు పడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.


