News January 23, 2025
Stock Markets: ఐటీ షేర్ల దూకుడు

మోస్తరు నష్టాల్లో మొదలైన స్టాక్మార్కెట్లు ప్రస్తుతం రేంజుబౌండ్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,156 (-2), సెన్సెక్స్ 76,448 (48) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ, మీడియా, ఫార్మా, ఆటో షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. FMCG, ఫైనాన్స్, బ్యాంకు, మెటల్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. విప్రో, అల్ట్రాటెక్, ట్రెంట్, M&M, టెక్M టాప్ గెయినర్స్. HUL, యాక్సిస్ బ్యాంకు, నెస్లేఇండియా, ఎస్బీఐ, BPCL టాప్ లూజర్స్.
Similar News
News November 28, 2025
సచిన్-ద్రవిడ్ రికార్డు బ్రేక్ చేయనున్న రో-కో!

నవంబర్ 30 నుంచి టీమ్ ఇండియా, సౌతాఫ్రికా మధ్య 3వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్-కోహ్లీ జోడీకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రాంచీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో వీళ్లు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. వీళ్లు జోడీగా 391 అంతర్జాతీయ మ్యాచులు ఆడారు. సచిన్-ద్రవిడ్ కూడా సరిగ్గా అన్నే మ్యాచులు కలిసి ఆడారు. రాంచీలో రోహిత్-కోహ్లీ కలిసి క్రీజులో నిల్చుంటే చాలు సచిన్-ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


