News January 27, 2025
స్టాక్మార్కెట్లు విలవిల.. నిఫ్టీ 23,000 సపోర్టు బ్రేక్

దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 22,955 వద్ద చలిస్తోంది. కీలకమైన 23,000 సపోర్ట్ జోన్ను బ్రేక్ చేసింది. మరోవైపు సెన్సెక్స్ 440 పాయింట్లు పతనమై 75,774 వద్ద కొనసాగుతోంది. ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 6.44% పెరిగి 17.83 వద్దకు చేరుకుంది. FMCG మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. BRITANNIA, HUL, ITC, ICICIBANK, NESTLE IND టాప్ గెయినర్స్.
Similar News
News December 7, 2025
విశాఖపట్నం-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం ECO రైల్వే అధికారులు విశాఖ-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు తెలిపారు. విశాఖ–SMVT బెంగళూరు స్పెషల్ విశాఖ నుంచి డిసెంబర్ 8న మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగుప్రయాణంలో బెంగళూరు నుంచి డిసెంబర్ 9న మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:30కి విశాఖ చేరుతుందన్నారు.
News December 7, 2025
నేటి ముఖ్యాంశాలు

✸ జగన్కు దేవుడంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు
✸ TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి
✸ గ్లోబల్ సమ్మిట్కు ప్రత్యేక విమానాలు: భట్టి
✸ కొడుకు, అల్లుడు, బిడ్డే KCRను ముంచుతారు: రేవంత్
✸ రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుంది: నిర్మల
✸ 95% ఫ్లైట్ కనెక్టివిటీని పునరుద్ధరించాం: ఇండిగో
✸ దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా
News December 7, 2025
రెండు మూడేళ్లుగా ఇలా ఆడలేదు: కోహ్లీ

ఇటీవలికాలంలో తాను ఈ తరహాలో ఆడలేదని విరాట్ కోహ్లీ తెలిపారు. ‘ఈ సిరీస్లో ఆటతో సంతృప్తిగా ఉన్నాను. నిజాయతీగా చెప్పాలంటే గడిచిన రెండు మూడేళ్లలో ఈ విధంగా ఆడలేదు. 15-16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో కొన్నిసార్లు మన సామర్థ్యంపై అనుమానం కలుగుతుంది. మిడిల్ ఆర్డర్లో ఇలా ఆడితే జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలుసు’ అని కోహ్లీ చెప్పారు. కాగా SAపై కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో అదరగొట్టారు.


