News July 8, 2025
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. చివర్లో కొనుగోళ్ల మద్దతుతో లాభాలు ఆర్జించాయి. Sensex 270 పాయింట్ల లాభంతో 83,712 వద్ద ముగిసింది. నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 25,522 వద్ద స్థిరపడింది. కోటక్ మహీంద్రా, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, NTPC, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, SBI, విప్రో షేర్లు లాభపడగా.. టైటాన్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి షేర్లు నష్టపోయాయి.
Similar News
News July 8, 2025
ఈ నెల 13 వరకే ఫిర్యాదులకు అవకాశం

AP: అన్నదాత సుఖీభవ-PM కిసాన్కు సంబంధించి అర్హుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. జాబితాలో పేరు లేనివారు రైతు సేవా కేంద్రంలో అర్జీలు అందజేయొచ్చని, అన్నదాత సుఖీభవ పోర్టల్లోని గ్రీవెన్స్ మాడ్యూల్లోనూ ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. అందుకు ఈ నెల 13వరకే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ పథకం కింద ఈ నెలలోనే రూ.7వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
News July 8, 2025
అవి సేఫ్.. వెయ్యికి పైగా విమానాలున్నాయి: ఎయిరిండియా

అహ్మదాబాద్లో కుప్పకూలిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ మోడల్ విమానం సురక్షితమైందేనని ఎయిరిండియా తెలిపింది. పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఆ సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మోడల్ ఎయిర్క్రాఫ్ట్స్ వెయ్యికి పైగా సేవలందిస్తున్నాయన్నారు. అధికారిక దర్యాప్తు నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ మీటింగ్లో ఎయిరిండియా CEO విల్సన్, DGCA, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News July 8, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూ.గో., ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడగా, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం కనిపించింది. నేడు మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉండిందో కామెంట్ చేయండి.