News February 11, 2025

Stock Markets Crash: Rs10లక్షల కోట్ల నష్టం

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు రక్తమోడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు రావడం, డాలర్ పెరుగుదల, ట్రంప్ ఆంక్షల దెబ్బకు సూచీలు కుదేలయ్యాయి. నిఫ్టీ 330 పాయింట్లు నష్టపోయి 23,048, సెన్సెక్స్ 1074 పాయింట్లు ఎరుపెక్కి 76,223 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.10లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్రాసిమ్ మినహా నిఫ్టీలో అన్ని షేర్లూ క్రాష్ అయ్యాయి.

Similar News

News January 20, 2026

కలియుగ విపత్తుల నుంచి రక్షణ పొందాలంటే..

image

‘కలి’ అంటే నీటిలో లీనమయ్యే యుగమని అర్థం. కలియుగ ప్రభావంతో అకాల వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించి జనజీవనం అతలాకుతలమవుతుంది. మనుషులు ప్రవాహాల్లో కొట్టుకుపోయేంత ప్రకృతి వైపరీత్యాలు ఈ కాలంలో సంభవిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఉపశమనం, మనశ్శాంతి పొందడానికి నిరంతర దైవధ్యానం, భగవంతుడి నామస్మరణ మాత్రమే ఏకైక మార్గమని శాస్త్రాలు సూచిస్తున్నాయి. భక్తి మార్గమే ఈ కలి దోషాలకు నివారణ.

News January 20, 2026

పుత్తడి పరుగులు.. పెళ్లి చేసేదెలా?

image

ఫిబ్రవరి 19 నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్న తరుణంలో బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడం సామాన్యులను కలవరపెడుతోంది. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే బంగారం తప్పనిసరి కావడంతో, ఈ పెరుగుదల సామాన్య కుటుంబాలపై పెను భారంగా మారింది. పసిడి పరుగులు ఇలాగే కొనసాగితే పెళ్లిళ్ల సమయానికి 10 గ్రాముల బంగారం రూ. 2 లక్షలకు చేరుతుందేమోనన్న భయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం 24క్యారెట్ల 10gల బంగారం ధర రూ.1.52లక్షలుగా ఉంది.

News January 20, 2026

INTER EXAMS: 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

image

TG: ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు. గతేడాది అమలు చేసిన ఈ నిబంధనలు ఈసారి కూడా కొనసాగించనున్నట్లు ఇంటర్ బోర్డ్ పేర్కొంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.