News June 18, 2024
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్లిన డిఫెన్స్ స్టాక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 308 పాయింట్లు లాభపడి 77,301కు చేరగా, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 23,557 వద్ద ముగిసింది. పవర్గ్రిడ్, విప్రో, ICICI బ్యాంక్, టైటాన్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. రక్షణ రంగంలో ఎగుమతులను 2029కి ₹50వేలకోట్లకు పెంచాలని కేంద్రం కొత్త లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఢిఫెన్స్ స్టాక్స్ దూసుకెళ్లాయి. గరిష్ఠంగా పరాస్ ఢిఫెన్స్ 20% లాభాన్ని రికార్డ్ చేసింది.
Similar News
News January 5, 2026
ESIC నవీ ముంబైలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 5, 2026
సెంచరీలు బాదడంలో ఇతని ‘రూటే’ సపరేటు!

ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ టెస్టుల్లో నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదుతున్నారు. 2021 నుంచి అతను ఏకంగా 24 శతకాలు కొట్టడమే దీనికి నిదర్శనం. రూట్ తర్వాత ప్లేస్లో నలుగురు ప్లేయర్లు ఉండగా, వారిలో ఒక్కొక్కరు చేసిన సెంచరీలు 10 మాత్రమే. ఈ ఫార్మాట్ ఆడుతున్న యాక్టివ్ ప్లేయర్లలో సచిన్ టెస్ట్ సెంచరీల(51) రికార్డును బద్దలు కొట్టే సత్తా ప్రస్తుతం రూట్కే ఉంది. తాజాగా యాషెస్లో ఆయన 41వ సెంచరీ సాధించారు.
News January 5, 2026
అమెరికా దాడిలో మదురో సెక్యూరిటీ టీమ్ క్లోజ్!

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించే క్రమంలో అమెరికా సైన్యం జరిపిన ఆపరేషన్ పెను విధ్వంసానికి దారితీసింది. ఈ దాడిలో మదురో సెక్యూరిటీ టీమ్లో మెజారిటీ సభ్యులు చనిపోయినట్లు ఆ దేశ రక్షణ మంత్రి పాడ్రినో సంచలన ప్రకటన చేశారు. US బలగాలు ‘కోల్డ్ బ్లడెడ్’గా తమ సైనికులు, అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్నాయని ఆరోపించారు. తమ నేతను వెంటనే విడుదల చేయాలని వెనిజులా సైన్యం డిమాండ్ చేసింది.


