News June 18, 2024
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్లిన డిఫెన్స్ స్టాక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 308 పాయింట్లు లాభపడి 77,301కు చేరగా, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 23,557 వద్ద ముగిసింది. పవర్గ్రిడ్, విప్రో, ICICI బ్యాంక్, టైటాన్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. రక్షణ రంగంలో ఎగుమతులను 2029కి ₹50వేలకోట్లకు పెంచాలని కేంద్రం కొత్త లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఢిఫెన్స్ స్టాక్స్ దూసుకెళ్లాయి. గరిష్ఠంగా పరాస్ ఢిఫెన్స్ 20% లాభాన్ని రికార్డ్ చేసింది.
Similar News
News September 15, 2025
నేటి నుంచి ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్

TG: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఇవాళ ప్రారంభంకానుంది. ఈరోజు రిజిస్ట్రేషన్స్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ఉంటుంది. రేపు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్స్, 20న సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాల కోసం WWW.TGICET.NIC.INను సందర్శించండి.
News September 15, 2025
ఆందోళనలకు తలొగ్గం: బ్రిటన్ ప్రధాని

వలసలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న <<17705243>>నిరసనల్లో<<>> దాడులు జరగడాన్ని UK PM కీర్ స్టార్మర్ ఖండించారు. ‘జాతీయ జెండా ముసుగులో హింసకు పాల్పడుతున్న వారికి బ్రిటన్ ఎప్పటికీ లొంగిపోదు. ఆందోళనలకు తలొగ్గే ప్రసక్తే లేదు. పౌరులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుంది. అధికారులపై దాడులు చేయడంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేరు. కలర్, బ్యాగ్రౌండ్ ఆధారంగా ప్రజలను టార్గెట్ చేసుకోవడాన్ని అంగీకరించం’ అని స్పష్టం చేశారు.
News September 15, 2025
24 గంటల్లో 3 మ్యాచులు ఆడిన ప్రొటీస్ క్రికెటర్

దక్షిణాఫ్రికా క్రికెటర్ జోర్న్ ఫార్టూయిన్ ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. 24 గంటల వ్యవధిలోనే మూడు T20 మ్యాచులు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. SEP 12న రా.6.30 గంటలకు మాంచెస్టర్లో ఇంగ్లండ్తో T20 మ్యాచ్ ఆడారు. 13న మ.2.30 గంటలకు బర్మింగ్హామ్లో జరిగిన T20 బ్లాస్ట్ సెమీఫైనల్లో హ్యాంప్షైర్ తరఫున పాల్గొన్నారు. హ్యాంప్షైర్ ఫైనల్కు దూసుకెళ్లడంతో ఆ వెంటనే రా.6.45 గంటలకు ఆ మ్యాచ్ కూడా ఆడేశారు.