News April 29, 2024
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు జోరు ప్రదర్శించాయి. సెన్సెక్స్ 941 పాయింట్లు లాభపడి 74671కు చేరగా.. నిఫ్టీ 224 పాయింట్లు పెరిగి 22643 వద్ద స్థిరపడింది. రియల్టీ, FMCG, మెటల్ మినహా అన్ని ప్రధాన రంగాల షేర్లు లాభాలు నమోదు చేయడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, SBIN, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి.
Similar News
News November 22, 2025
నేను ఒరిజినల్: బాలకృష్ణ

ఈ రోజుల్లో ఫిల్మ్ మేకింగ్ పూర్తిగా సాంకేతికతపైనే ఆధారపడి ఉందని నందమూరి బాలకృష్ణ అన్నారు. తన సినిమాలు అసాధారణంగా ఉంటాయని పేర్కొన్నారు. ‘నా సినిమాల్లో అవసరమైతేనే సాంకేతికతను వాడుతా. ఈ రోజుల్లో ప్రతిదానికి టెక్నాలజీని వాడుతున్నారు. హీరోలు సెట్స్కు రాకుండా గ్రీన్ మ్యాట్ వేసుకొని షూట్ చేసేస్తున్నారు. నేను అలా కాదు ఒరిజినల్’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన నటించిన అఖండ-2 DEC 5న రిలీజ్ కానుంది.
News November 22, 2025
HBTUలో 29 టీచింగ్ పోస్టులు

యూపీలోని హర్కోర్ట్ బట్లర్ టెక్నికల్ యూనివర్సిటీ (HBTU) 29 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. MCA, PG, PhD, ME, M.Tech, NET/SET ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://hbtu.ac.in/
News November 22, 2025
రోజూ 30 నిమిషాలు నడిస్తే..!

రోజూ 30 నిమిషాలు నడవడం అత్యంత శక్తివంతమైన ఔషధమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీనికి ఖర్చంటూ ఉండదని, దుష్ప్రభావాలు కూడా లేవని సూచించారు. ప్రతిరోజు అరగంట నడిస్తే గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, డిప్రెషన్, డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఇది మెరుగైన నిద్ర, ఉల్లాసకరమైన మూడ్ను ఇస్తుందని సూచించారు. SHARE IT


