News November 18, 2024
STOCK MARKETS: రికవరీ బాట పట్టినా..

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆరంభంలో భారీగా పతనమైన సూచీలు మధ్యాహ్నం రికవరీ అయ్యాయి. ఆఖర్లో తగ్గి మోస్తరు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 23,453 (-78), సెన్సెక్స్ 77,339 (-241) వద్ద క్లోజయ్యాయి. IT, మీడియా, ఫార్మా, హెల్త్కేర్, O&G షేర్లు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొన్నాయి. మెటల్, FMCG, PSU BANKS, REALTY స్టాక్స్ అదరగొట్టాయి. TCS, DRREDDY, INFY, BPCL, CIPLA టాప్ లూజర్స్.
Similar News
News December 20, 2025
ధనుర్మాసంలో శ్రీవారికి సుప్రభాత సేవ జరపరా?

సాధారణంగా ఏడాది పొడవునా తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. కానీ ధనుర్మాసంలో ఈ సేవకు బదులుగా ‘తిరుప్పావై’ పఠనం నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం వంటిది. అందుకే ఈ నెలలో శ్రీవారిని నిద్రలేపేందుకు గోదాదేవి రచించిన దివ్య ప్రబంధ పాశురాలను వినిపిస్తారు. ఫలితంగా ఈ నెల రోజులు సుప్రభాత సేవ ఏకాంతంగా కూడా జరగదు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 20, 2025
ఎలా మాట్లాడాలంటే?

ఇతరులతో మాట్లాడేటప్పుడు వ్యక్తిగత విషయాలను తీసుకురాకూడదంటున్నారు నిపుణులు. అలాగే ఏదైనా అంశాన్ని నిరూపించడానికి ఎక్కువ వాదించకూడదు. చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా చెప్పాలి. వివిధ అంశాల గురించి పైపైన టచ్ చేస్తూ చెప్పడం కంటే ఒక్క అంశాన్నే స్పష్టంగా వివరించడం మంచిది. చెప్పే సమయం కంటే, నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. కాబట్టి ఏ విషయాన్నైనా స్పష్టంగా, నాణ్యతతో తక్కువ సమయంలోనే చెప్పడానికి ప్రయత్నించాలి.
News December 20, 2025
మాట్లాడే విధానం ఎంతో కీలకం

ఏదైనా చర్చలో పాల్గొన్నప్పుడే మనిషి వ్యక్తిత్వం బయటపడుతుంటుంది. అందుకే ఉద్యోగ నియామకాల్లో గ్రూప్ డిస్కషన్లు పెడుతుంటారు. అలాంటప్పుడు తోటివారికి అవకాశం ఇవ్వకుండా మీరే మాట్లాడకూడదు. ఆలుమగల మధ్య కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు భాగస్వామికి అవకాశం ఇవ్వరు. చెప్పాలనుకున్నవి ప్రభావవంతంగా వివరిస్తూనే ఇతరులకు అవకాశం ఇవ్వాలి. దానివల్ల ఒకరి అభిప్రాయాలు మరొకరికి స్పష్టంగా తెలిసి చర్చ అర్థవంతంగా ముగుస్తుంది.


