News March 21, 2025

Stock Markets: ఐదో రోజూ అదుర్స్

image

స్టాక్‌మార్కెట్లు వరుసగా ఐదో సెషన్లోనూ లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 23,266 (+78), సెన్సెక్స్ 76,580 (+238) వద్ద చలిస్తున్నాయి. ఐటీ, వినియోగం మినహా అన్ని సెక్టోరల్ సూచీలు ఎగిశాయి. రియాల్టి, హెల్త్‌కేర్, PSE, ఫార్మా, CPSE, మీడియా, ఎనర్జీ, చమురు, ఆటో, కమోడిటీస్ షేర్లకు డిమాండ్ ఉంది. బజాజ్ ఫైనాన్స్, హీరోమోటో, సన్‌ఫార్మా, బజాజ్ ఆటో, నెస్లే టాప్ గెయినర్స్. ఇన్ఫీ, HDFC బ్యాంకు, టైటాన్ టాప్ లూజర్స్.

Similar News

News March 28, 2025

‘ఎల్2: ఎంపురాన్’పై విమర్శలు!

image

మోహన్‌లాల్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. అయితే, సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఓ గ్రూప్ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టాయి. స్టార్టింగ్ ఎపిసోడ్ సహా మరికొన్ని సన్నివేశాలు కావాలనే చేసినట్టు ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు. మతపరమైన వాటిలో తప్పుగా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో డైరెక్టర్ పృథ్వీరాజ్‌పై తీవ్ర విమర్శలొస్తున్నాయి.

News March 28, 2025

చైనాకు దగ్గరవుతున్న బంగ్లా

image

పొరుగు దేశం బంగ్లాదేశ్ చైనాకు దగ్గరవుతోంది. చైనీస్ ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియల్ జోన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు చైనాతో కలిసి పని చేస్తామని ప్రకటించింది. తాము తైవాన్ స్వాతంత్ర్యాన్ని అంగీకరించబోమని, అది చైనాలో భాగమని స్పష్టం చేసింది. తమ దేశంలోని పోర్టులు, ఇతర ప్రాజెక్టుల్లో చైనా భాగం కావాలని కోరింది. అలాగే చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తమ దేశానికి రావాలని బంగ్లా తాత్కాలిక చీఫ్ యూనస్ ఆహ్వానించారు.

News March 28, 2025

BREAKING: టెన్త్ పరీక్ష వాయిదా

image

AP: ఈనెల 31న జరగాల్సిన టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జామ్‌ను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్‌ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు. కాగా పరీక్షల షెడ్యూల్ విడుదల సమయంలోనే చివరి ఎగ్జామ్ తేదీ విషయంలో మార్పు ఉండొచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే.

error: Content is protected !!