News March 20, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.
Similar News
News February 22, 2026
బొగ్గుల శ్రీనివాస్ మరణం.. వీడిన మిస్టరీ

TG: యూట్యూబర్, రచయిత బొగ్గుల శ్రీనివాస్ <<19145902>>మరణంపై<<>> మిస్టరీ వీడింది. ఆర్థిక లావాదేవీలతోనే ఆయనను మాధవరెడ్డి సుఫారీ గ్యాంగ్తో హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ‘శ్రీనివాస్ GST పర్మిషన్ను మాధవరెడ్డి వాడుకుని డబ్బులు చెల్లించలేదు. దీంతో ఆయన ఒత్తిడి చేయడంతో నార్కెట్పల్లి వద్ద హత్య చేసి కారుతో సహా పాలేరు రిజర్వాయర్లో తోసేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం’ అని పోలీసులు చెప్పారు.
News February 22, 2026
BELలో మేనేజ్మెంట్ ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టులు

చెన్నైలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News February 22, 2026
రేపు స్టాక్ మార్కెట్లపై వీటి ప్రభావం?

US-ఇరాన్ టెన్షన్స్, అమెరికా సుప్రీంకోర్టు టారిఫ్స్ రద్దు ప్రభావం రేపు దేశీయ స్టాక్ మార్కెట్లపై ఉండొచ్చని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. US సుప్రీంకోర్టు తీర్పు, వెస్ట్ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్గా క్లోజ్ అవడం సానుకూలంగా ఉంది. అయితే ఈనెల 24 నుంచి 15% టారిఫ్స్ అమలు కానున్నట్లు ట్రంప్ ప్రకటించడం, ముడి చమురు ధరలు పెరగడం, దేశీయ-విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపీ పతనం ప్రతికూల అంశాలుగా ఉన్నాయి.


