News March 20, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.
Similar News
News January 31, 2026
NZB: కార్పొరేటర్ అభ్యర్థి రూ. 7.50 కోట్ల పన్ను చెల్లింపు

నిజామాబాద్ నగరపాలక సంస్థకు కాసుల వర్షం కురిసింది. ఎన్నికల నేపథ్యంలో పాత బకాయిలన్నీ వసూలవుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నో డ్యూ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో పోటీ చేసే అభ్యర్థులు పాత బకాయిలు కడుతున్నారు. ఇందులో భాగంగా నిన్న 19వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శమంత నరేందర్ తమ వంశీ హోటల్కు సంబంధించి ఆస్తి పన్ను రూ. 7.50 కోట్లు చెల్లించారు.
News January 31, 2026
INDvsPAK.. రేపే డూ ఆర్ డై మ్యాచ్

U19 WCలో రేపు ZIM వేదికగా IND, PAK తలపడనున్నాయి. ఇప్పటికే మూడు జట్లు (AUS, AFG, ENG) సెమీస్ చేరాయి. మిగిలిన స్థానం కోసం IND, PAK మధ్య పోటీ ఉంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో IND 6, PAK 4 పాయింట్లతో ఉన్నాయి. టీమిండియా రన్ రేట్ కూడా మెరుగ్గా ఉంది. దీంతో PAK సెమీస్ చేరాలంటే 105 లేదా అంతకంటే ఎక్కువ రన్స్ తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్ అయితే 251 పరుగులను 29.4 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది.
News January 31, 2026
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

AP: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి దర్శనానికి 10 గంటల వరకు సమయం పడుతోంది. అటు వేంకటేశ్వరుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 69,254 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా 20,954 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35కోట్లుగా నమోదైనట్లు TTD తెలిపింది.


