News March 20, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.
Similar News
News March 9, 2026
ఇరాన్ కొత్త సుప్రీం.. US, ఇజ్రాయెల్కు చైనా వార్నింగ్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నియామకంపై చైనా, రష్యా స్పందించాయి. ఈ నియామకాన్ని ఇరాన్ ఇంటర్నల్ మ్యాటర్గా పేర్కొన్న చైనా కొత్త లీడర్ను లక్ష్యంగా చేసుకోవద్దని US, ఇజ్రాయెల్లను హెచ్చరించింది. మరోవైపు మొజ్తబాకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలిపారు. ఈ కష్టకాలంలో ఇరాన్కు తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇరాన్ ప్రజల సపోర్ట్తో తండ్రి ఆశయాలను కొనసాగిస్తారని ఆశిస్తున్నామన్నారు.
News March 9, 2026
ఆయిల్ ధర $200.. ఇరాన్ వార్నింగ్!

బ్యారెల్ క్రూడాయిల్ ధర $200 దాటినా తట్టుకోగలమంటేనే ఈ యుద్ధ క్రీడలోకి దిగండంటూ US బేస్లున్న గల్ఫ్ దేశాలను IRGC అడ్వైజర్ ఇబ్రహీం జబారీ హెచ్చరించారు. ఇరాన్ తన ‘మొజాయిక్ డిఫెన్స్’ వ్యూహం ద్వారా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ టెర్మినల్స్ను లక్ష్యంగా చేసుకుంటోంది. 31 ఇండిపెండెంట్ కమాండ్లు, నెలకు 10,000 డ్రోన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఇరాన్ ఏ క్షణమైనా చమురు ఎగుమతులను అడ్డుకోగలదని జబారీ హెచ్చరించారు.
News March 9, 2026
స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్.. ₹7.5 లక్షల కోట్లు ఆవిరి

అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఏకంగా 753 పాయింట్ల మేర పడిపోయిన నిఫ్టీ.. మధ్యాహ్నానికి కోలుకుని 24,028(-422) వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1,353 పాయింట్లు కోల్పోయి 77,566 వద్ద స్థిరపడింది. రిలయన్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ స్వల్పంగా లాభపడ్డాయి. అల్ట్రాటెక్, మారుతి, SBI, టాటా స్టీల్ భారీగా నష్టపోయాయి. ₹7.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.


