News March 20, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.
Similar News
News February 6, 2026
థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలంటే

థైరాయిడ్ టెస్ట్ ఉదయం తొమ్మిది గంటల్లోపు ఖాళీ కడుపుతో చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజులో ఏ సమయంలోనైనా పరీక్ష జరిగితే రిపోర్ట్ కరెక్ట్గా రాదు. రోగులు థైరాయిడ్ పరీక్షల కోసం వచ్చినప్పుడు మందులు తీసుకోకూడదు. రోగులు తమంతట తాముగా మందుల మోతాదు లేదా మొత్తాన్ని తగ్గించుకోకూడదు. అలాగే హైపర్ థైరాయిడిజం మందులను ఎప్పుడైనా తీసుకోవచ్చు. హైపోథైరాయిడిజం మందులు మాత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
News February 6, 2026
రెండో వాహనం కొనుగోలు చేసేవారికి గుడ్న్యూస్

TG: రెండో వాహనం కొనుగోలు చేసేవారికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గుడ్న్యూస్ చెప్పనుంది. సెకండ్ వెహికల్పై విధిస్తున్న 2 శాతం అదనపు రోడ్డు ట్యాక్స్ను రద్దు చేయాలన్న రవాణాశాఖ ప్రతిపాదనకు సీఎం రేవంత్రెడ్డి అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో వాహనదారులపై ఏటా సుమారు రూ.150 కోట్లకు పైగా భారం తగ్గనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
News February 6, 2026
గుడ్ల రైతులకు గడ్డు కాలం

AP: రాష్ట్రంలో గుడ్ల రైతులకు గడ్డు కాలం మొదలైంది. <<18548750>>రెండు నెలల<<>> కిందట 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో ₹695 పలకగా ఇప్పుడు ₹480కి పడిపోయింది. గోదావరి నెక్ గుడ్లకు ప్రధాన మార్కెట్ అయిన కోల్కతాలో డిమాండ్ లేదంటూ ట్రేడర్లు ₹437కు బేరం ఆడుతున్నారని రైతులు వాపోతున్నారు. 4 రోజులుగా రవాణా నిలిచిపోవడంతో గుడ్లు పేరుకుపోయి పాడవుతున్నాయంటున్నారు. తమకు ఒక్కో గుడ్డు ఉత్పత్తికి ₹5.50 ఖర్చవుతోందని చెబుతున్నారు.


