News March 20, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

image

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.

Similar News

News March 6, 2026

యుద్ధం ఇప్పట్లో ముగియదా?

image

ఇజ్రాయెల్, US-ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం 14దేశాలకు విస్తరించింది. ఇరాక్, కువైట్, UAE, బహ్రెయిన్, ఖతర్, జోర్డాన్, అజర్‌బైజాన్, ఒమన్, సౌదీ, లెబనాన్, సైప్రస్ వీటిలో ఉన్నాయి. దీంతో ఇప్పట్లో వార్ ముగిసేలా కనిపించడం లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలా దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇరాన్‌కు అండగా నిలుస్తున్న రష్యా, చైనా కూడా రంగంలోకి దిగితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనుంది.

News March 6, 2026

23న నక్కపల్లి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

image

AP: అనకాపల్లి(D) నక్కపల్లిలో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23వ తేదీ ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థల ఆధ్వర్యంలో భూమిపూజ చేయనున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ వెల్లడించారు. రూ.1.5లక్షల కోట్ల అంచనాతో ప్లాంట్ నిర్మాణం జరగనుండగా, తొలి విడతలో రూ.80వేల కోట్లతో పనులు స్టార్ట్ అవుతాయని చెప్పారు. 2029 నాటికి మొదటి దశ పూర్తి చేయడమే లక్ష్యమన్నారు.

News March 6, 2026

యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడి గుడ్ల ధర!

image

అమెరికా-ఇజ్రాయెల్vsఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంలోని పౌల్ట్రీ రంగంపైనా పడింది. రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. మిడిల్ ఈస్ట్‌ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడి గుడ్ల నిల్వలు పెరిగి ధరలు దారుణంగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను రూ.4.30గా నిర్ణయించగా, స్థానిక మార్కెట్లలో రూ.3.50 పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది.