News March 20, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

image

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.

Similar News

News February 6, 2026

మచిలీపట్నం హైవే కారిడార్‌కు ఫండ్స్.. గడ్కరీకి లోకేశ్ థాంక్స్

image

AP: మచిలీపట్నం పోర్టు రోడ్డును NH-216 జంక్షన్‌కు అనుసంధానించే 6 లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.573.77 కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి గడ్కరీ SMలో వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో పోర్టు నుంచి హైవేకు సరకు రవాణా సమయం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం సహకరిస్తున్న గడ్కరీకి ధన్యవాదాలు అని ఆయన పోస్ట్‌కు మంత్రి లోకేశ్ రిప్లై ఇచ్చారు.

News February 5, 2026

గుండెపోటు రావొద్దంటే ఇవి తినాల్సిందే!

image

ధమనుల లోపలి గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడంతో అవి బ్లాక్ అయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ఓట్స్, అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. టమాటాల్లోని విటమిన్ C, E, ఫ్లేవనాయిడ్స్ వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. క్యాబేజీ, బ్రోకలీ, కాలిఫ్లవరూ ఎంతగానో దోహదపడతాయి. చేపలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

News February 5, 2026

ఏప్రిల్-మేలో SIR నోటిఫికేషన్: CEO

image

TG: రాష్ట్రంలో ఏప్రిల్-మే నెలల్లో SIR నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని CEO సుదర్శన్ రెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఇవాళ ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు కనీసం ఒక బూత్ లెవెల్ ఏజెంట్‌(BLA)ను నియమించుకోవాలని పార్టీలకు సూచించారు. 2025 జాబితాలో ఉన్న ఓటర్లను 2002 SIRలో నమోదైన ఓటర్లతో అనుసంధానించేలా టేబుల్ టాప్ మ్యాపింగ్ చేపట్టామని తెలిపారు.