News March 20, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

image

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.

Similar News

News February 18, 2026

15 గంటలు రోడ్లపైనే తిరిగారు.. పాక్ పరువు పోయిందిగా!

image

హాకీ ప్రో లీగ్ కోసం ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లిన పాకిస్థాన్ హాకీ ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. మేనేజ్మెంట్ హోటల్ రూమ్స్‌కు డబ్బులు చెల్లించకపోవడంతో వేరే బస కోసం 12-15 గంటలు సిడ్నీ వీధుల్లోనే తిరిగారు. చివరికి సొంతఖర్చులతో రూమ్ తీసుకున్నారు. ఫుడ్ కోసమూ ఇబ్బందులు పడ్డారు. ఇండియా ముందు పాక్ పరువు పోకూడదని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో మొదట ఖండించానని.. కానీ అదంతా నిజమేనని కెప్టెన్ షకీల్ భట్ వెల్లడించారు.

News February 18, 2026

‘నేను ఇండియాకు రాలేను’.. బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

image

తాను భారత్‌కు తిరిగి రాలేనని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా బాంబే హైకోర్టుకు తెలిపారు. తన వద్ద యాక్టివ్ పాస్‌పోర్టు లేదని, పైగా బ్రిటన్ విడిచి వెళ్లకుండా అక్కడి కోర్టుల ఆంక్షలు ఉన్నాయని ఆయన తరఫు లాయర్ అమిత్ దేశాయ్ తెలిపారు. భారత్‌కు రానంత వరకు మాల్యా పిటిషన్లను విచారించబోమని చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ నేతృత్వంలోని ధర్మాసనం గతవారం స్పష్టం చేయడంతో ఆయన ఈ వివరణ ఇచ్చారు.

News February 18, 2026

అజిత్ పవార్ దుర్మరణం రోజే 75 ఫైళ్లు క్లియర్.. ఎలా సాధ్యం?

image

జనవరి 28న అజిత్ పవార్ విమాన ప్రమాద వార్తతో మహారాష్ట్ర మొత్తం షాక్‌లో ఉంటే ఆ రాష్ట్ర మైనారిటీ శాఖ మాత్రం అదే రోజు ఏకంగా 75 స్కూల్ ఫైళ్లను క్లియర్ చేసేసింది. ఒక్క రోజులోనే ఇన్ని ఫైళ్లపై సంతకాలు ఎలా చేశారంటూ విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రచ్చ ముదరడంతో డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్‌పై బదిలీ వేటు పడింది. దీని వెనక ఏదో మతలబు ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.