News March 20, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

image

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.

Similar News

News February 4, 2026

ఖమ్మం జిల్లాకు 1,517 టన్నుల యూరియా

image

ఖమ్మం జిల్లా రైతుల కోసం ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 1,517.16 మెట్రిక్ టన్నుల యూరియా మంగళవారం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు చేరుకుంది. ఏఓ పవన్‌కుమార్ పర్యవేక్షణలో ఈ నిల్వలను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. సాగు అవసరాలకు తగినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. సరఫరాలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

News February 4, 2026

ఢిల్లీ హైకోర్టులో 152 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

<>ఢిల్లీ <<>>హైకోర్టు 152 పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత గల వారు FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణ FEB 27 వరకు చేసుకోవచ్చు. వయసు 18- 32ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమ్స్, మెయిన్(డిస్క్రిప్టివ్) పరీక్ష, టైప్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.1300. సైట్: delhihighcourt.nic.in

News February 4, 2026

జట్లు వేరైనా మూలాలు మనవే!

image

FEB 7న మొదలుకానున్న T20 WCలో దాదాపు 35+ భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. USA సారథి మోనాంక్ పటేల్, కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా, ఒమన్ సారథి జతీందర్ సింగ్‌లతో పాటు USA పేసర్ సౌరభ్ వంటి ప్లేయర్స్ విదేశీ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. మరోవైపు భారత్-అమెరికా జట్ల మధ్య పోరును నెటిజన్లు ‘పాస్‌పోర్ట్ VS గ్రీన్ కార్డ్’ మ్యాచ్ అని సరదాగా జోకులు పేలుస్తున్నారు.