News March 20, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

image

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.

Similar News

News March 9, 2026

ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్‌ దాడులు.. అమెరికా సీరియస్!

image

ఇరాన్‌పై దాడుల విషయంలో US, ఇజ్రాయెల్ మధ్య తొలిసారిగా విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. 30 ఇరాన్ ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడి చేయడంపై US అసహనం వ్యక్తం చేసిందని Axios సంస్థ తెలిపింది. ముందుగా అనుకున్న దానికంటే ఇజ్రాయెల్ భారీగా దాడులు చేయడంపై ట్రంప్ అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు చమురు ధరల పెరుగుదల తాత్కాలికమేనని.. US, ప్రపంచ శాంతి కోసం ఆ మాత్రం మూల్యం చెల్లించక తప్పదని ట్రంప్ తెలిపారు.

News March 9, 2026

పది నిమిషాల్లో ₹12.39లక్షల కోట్లు ఆవిరి!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు రికార్డ్ స్థాయి నష్టాలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ప్రారంభమైన 10 నిమిషాల్లో ₹12.39లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. దీంతో సెన్సెక్స్ టోటల్ మార్కెట్ క్యాప్ ₹437లక్షల కోట్లకు పడిపోయింది. అత్యధికంగా ఇండిగో 8% నష్టాన్ని నమోదు చేయగా.. SBI, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, ఎటర్నల్ దాదాపు 5% లాస్ నమోదు చేశాయి.

News March 9, 2026

ఎవరెస్ట్ గురించి ఈ విషయం మీకు తెలుసా?

image

ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం ఒకప్పుడు సముద్రపు అడుగున ఉండేదనే విషయం మీకు తెలుసా? ప్రస్తుతం హిమాలయాలు ఉన్నచోట కోట్ల సంవత్సరాల క్రితం ‘టెథిస్’ అనే సముద్రం ఉండేది. అందుకే ఎవరెస్ట్ పైన దొరికే రాళ్లలో ‘ఆమ్మోనైట్స్’ వంటి సముద్ర జీవుల శిలాజాలు, సున్నపురాళ్లు కనిపిస్తాయి. ఆ భూభాగం ఒకప్పుడు సముద్రపు అడుగున ఉండేదనడానికి ఇవే బలమైన సాక్ష్యాలు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.