News March 20, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

image

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.

Similar News

News February 14, 2026

పనసలో కాయకుళ్లుతో కలిగే నష్టాలు

image

పనసలో కాయకుళ్లు తెగులు ప్రధానంగా బూజు తెగులు వల్ల వస్తుంది. ఇది పూత, పిందె దశలో మొదలై కాయకు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించడం వల్ల తొలుత మగ పువ్వులు, పూత, పిందెలు కుళ్లిపోతాయి. తర్వాత ఎదిగే కాయలు నల్లగా మారి కుళ్లిపోతాయి. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ తెగులు ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకుంటే దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.

News February 14, 2026

AI సమ్మిట్‌కు NVIDIA సీఈవో దూరం

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ నెల 16 నుంచి 20 వరకు ఢిల్లీలో AI Impact Summit నిర్వహిస్తోంది. దీనికి NVIDIA సీఈవో జెన్‌సెన్ హువాంగ్ కూడా రావాల్సి ఉండగా తాజాగా పర్యటన రద్దయింది. అనివార్య కారణాలతో ఆయన రాలేకపోతున్నారని కంపెనీ తెలిపింది. 100 దేశాల నుంచి 35,000 మంది అతిథులు సమ్మిట్‌కు రానుండగా వీరిలో బిల్‌గేట్స్, ఆల్ట్‌మన్, పిచాయ్ తదితరులున్నారు.

News February 14, 2026

శివరాత్రి: చిన్న పరిహారంతో దోషాలన్ని దూరం!

image

లోకకల్యాణం కోసం శివలింగం శాంతంగా, చల్లగా ఉండాలి. అందుకే దానిపై నిత్యం నీటి ధారలు పడేలా ‘ధారాపాత్ర’ను ఏర్పాటు చేస్తారు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడి నుంచి కురిసే అమృతధారలకు ఇది సంకేతం. మహాశివరాత్రి నాడు మనం చేసే అభిషేకంతో శివలింగం చల్లబడుతుంది. శివలింగం చల్లబడటం అంటే సమస్త ప్రాణికోటి సుఖశాంతులతో ఉండటమే. కాబట్టి ఆయనను అభిషేకిస్తే సకల పాపాలు తొలగిపోయి, మనశ్శాంతి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.