News March 20, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.
Similar News
News March 2, 2026
విండీస్పై విజయం.. భారత్ కొత్త రికార్డులు

T20WC: వెస్ట్ఇండీస్పై విజయంతో సెమీస్కు దూసుకెళ్లిన భారత్ ఈ మ్యాచ్తో కొత్త రికార్డులు నమోదు చేసుకుంది. 196 పరుగల లక్ష్యాన్ని ఛేదించడంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్ తన హైయెస్ట్ సక్సస్ఫుల్ ఛేజ్ నమోదు చేసింది. అలాగే ఇంగ్లండ్, సౌతాఫ్రికా తర్వాత అతిపెద్ద టోటల్ను ఛేజ్ చేసిన మూడో జట్టుగా నిలిచింది. T20WCలో సెమీస్కు ఆరుసార్లు క్వాలిఫై అయిన జట్టుగా ఇంగ్లండ్, పాక్ సరసన నిలిచింది.
News March 2, 2026
డీల్కు అతి చేరువలో ఉండగా US దాడి చేసింది: ఇరాన్ మంత్రి

అణు ఒప్పందానికి అతి చేరువలో ఉండగా US దాడులు చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయిద్ అబ్బాస్ అరాఘ్చి విమర్శించారు. చర్చలు జరుగుతుండగానే దాడులు చేసి దౌత్యాన్ని ట్రంప్ నాశనం చేశారన్నారు. చివరగా జెనీవాలో చర్చలు జరిగాక వచ్చే సమావేశంలో ఈ డీల్ ఖాయం చేసుకోవాలని అనుకున్నామని తెలిపారు. కాగా ఇరాన్ డీల్కు సుముఖంగానే ఉన్నా ట్రంప్ కావాలనే దాడులు చేయించినట్లు వెస్ట్ మీడియాలో పలు ఆరోపణలు వస్తున్నాయి.
News March 2, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 2)

* 1933: బాలీవుడ్ సంగీత దర్శకుడు పద్మశ్రీ ఆనంద్జీ వీర్జీ షా జననం
* 1936: రంగస్థల నటుడు అబ్బూరి గోపాలకృష్ణ జననం
* 1962: తెలంగాణ కవి యాకూబ్ జననం
* 1938: నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు మరణం
* 1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత కోకిల సరోజిని నాయుడు మరణం (ఫొటోలో)
* 1990: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా మంత్రి మసూమా బేగం మరణం


