News March 20, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

image

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.

Similar News

News February 6, 2026

ఇంట్లో దేవుళ్ల విగ్రహాలు పగిలిపోతే ఏం చేయాలి?

image

ఇళ్లలో పూజించిన దేవతా విగ్రహాలు పగిలినా, పటాలు చిరిగినా వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. వాటిని పారే నీటిలో నిమజ్జనం చేయాలని చెబుతున్నారు. చిరిగిన పటాలను పవిత్ర అగ్నిలో ఆహుతి చేయడం శ్రేయస్కరమని అంటున్నారు. ఏ పద్ధతిని అనుసరించినా దైవభావంతో గౌరవప్రదంగా చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఆధ్యాత్మిక విలువలను కాపాడిన వారవుతారు అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 6, 2026

కిచెన్‌లో వాడే సిలికాన్ మూతలు సేఫేనా?

image

కిచెన్‌లో ఈ మధ్య సిలికాన్ మూతలు కామన్‌గా కనిపిస్తున్నాయి. వాడడానికి, క్లీన్ చేయడానికి ఈజీగా ఉండడమే దీనికి కారణం. అయితే ఇవి సేఫేనా అనే సందేహం చాలా మందిలో తలెత్తుతోంది. సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం.. సర్టిఫైడ్ ఫుడ్ గ్రేడ్ సిలికాన్‌తో తయారు చేసిన మూతలు సురక్షితమే. అయితే వాటిని నార్మల్ కిచెన్ టెంపరేచర్‌ దగ్గర మాత్రమే వాడాలి. లేదంటే ప్లాస్టిక్ తరహాలోనే ఆరోగ్యానికి ముప్పు తలపెడతాయి.

News February 6, 2026

ఆ ఒక్క స్టార్టప్ విలువ.. మన 10 బడా IT కంపెనీల కంటే ఎక్కువ!

image

ఆంథ్రోపిక్ పేరు ఇప్పుడు IT ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ఈ స్టార్టప్ తెచ్చిన టూల్‌తో ఇండియన్ IT కంపెనీల షేర్లు బెంబేలెత్తిపోయాయి. ఈ నేపథ్యంలో SM వేదికగా ఒక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. రీసెంట్ ఫండింగ్ తర్వాత ఆంథ్రోపిక్ మార్కెట్ విలువ $350 బిలియన్లకు చేరింది. అదే టైమ్‌లో ఇండియాలోని టాప్-10 IT కంపెనీల విలువ దాదాపు $330 బిలియన్లకు పడిపోయింది. అంటే ఆ ఒక్క కంపెనీ వాల్యూ మన 10 కంపెనీల కంటే ఎక్కువ!