News March 20, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

image

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.

Similar News

News February 26, 2026

ఇండియా-జింబాబ్వే మ్యాచ్.. ‘డ్యూ’ రాకుండా ఏం చేశారంటే..?

image

T20 WC సూపర్-8లో ఇండియా-జింబాబ్వే మధ్య చెన్నైలో మరికొన్ని గంటల్లో కీలక పోరు జరగనుంది. డ్యూ(మంచు) ప్రభావం ఉండకుండా తేమను నియంత్రించే ప్రత్యేక రసాయనాన్ని గ్రౌండ్‌లో స్ప్రే చేశారు. ఇందుకోసం ‘డ్యూ క్యూర్’ కెమికల్‌ను US నుంచి తెప్పించారని తెలుస్తోంది. డ్యూ వల్ల బంతి స్కిడ్ అయి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేసే జట్టు ఇబ్బంది పడుతుంది. అలా జరగొద్దని కెమికల్ స్ప్రే చేశారు. మరి అదెలా పని చేస్తుందో!

News February 26, 2026

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>సోలార్ <<>>ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(SECI) 19 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BTech/BE, CA, MBA/PGDM, MCom/BCom అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. GMకు గరిష్ఠ వయసు 55, మేనేజర్‌కు 40ఏళ్లు, మిగతా పోస్టులకు 28ఏళ్లు. స్క్రీనింగ్ టెస్ట్/ రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.seci.co.in

News February 26, 2026

ఎందుకలా?!: షుగర్ ఉన్నవారిలో తరచూ నీరసం..

image

షుగర్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉన్నా అవయవాల్లోని కణాలకు అవసరమైన శక్తి అందక నీరసంగా అన్పిస్తుంది. దీనికి కారణం ఇన్సులిన్ అనే హార్మోన్ పని చేయకపోవడం. ఇన్సులిన్‌ను క్లోమం ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించి కణాలకు శక్తిని అందిస్తుంది. శరీరంలో ఇది తగినంత ఉత్పత్తి కాకపోతే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి డయాబెటిస్‌కు దారి తీస్తుంది. ప్రతిరోజూ 4pmకు ఎందుకలా?!.