News July 8, 2024
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. 4% తగ్గిన టైటాన్ షేర్!

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 191 పాయింట్లు క్షీణించి 79,800 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 24,291 వద్ద కొనసాగుతోంది. టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలివర్, హీరో మోటార్ కార్ప్ షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టైటాన్, శ్రీరామ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్, ఏషియన్ పేయింట్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. టైటాన్ షేర్ విలువ ఏకంగా 4% క్షీణించింది.
Similar News
News October 16, 2025
క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

TG: రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన సురేఖ.. సచివాలయానికి రాకుండా బయటకు వెళ్లిపోయారు. మిగతా మంత్రులందరూ హాజరయ్యారు. ఇటీవల నెలకొన్న <<18020734>>వివాదాలతో<<>> ఆమె మంత్రివర్గ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.
News October 16, 2025
గుజరాత్ మంత్రులంతా రాజీనామా

గుజరాత్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక ఎన్నికల దృష్ట్యా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కోసం ముఖ్యమంత్రి తప్ప మిగతా 16 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కాసేపట్లో సీఎం భూపేంద్ర పటేల్ గవర్నర్ను కలవనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు కొత్త క్యాబినెట్ కొలువుదీరనుంది. నూతన మంత్రివర్గంలో 10 మంది కొత్తవారికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం.
News October 16, 2025
నక్సలిజంపై పోరులో ల్యాండ్మార్క్ డే: అమిత్షా

ఛత్తీస్గఢ్లో ఇవాళ 170 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారని, నక్సలిజంపై పోరులో ల్యాండ్మార్క్ డే అని కేంద్ర హోంమంత్రి అమిత్షా వెల్లడించారు. ‘ఛత్తీస్గఢ్లోని అభూజ్మఢ్, నార్త్ బస్తర్ నక్సల్ టెర్రర్ నుంచి విముక్తి పొందాయి. 2024 JAN నుంచి 2,100 మంది నక్సలైట్లు సరెండరయ్యారు. 1,785 మంది అరెస్టయ్యారు. 477 మంది హతమయ్యారు. 2026 MAR 31లోపు నక్సలిజం అంతరిస్తుందనడానికి ఈ నంబర్లు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.