News July 18, 2024
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. బజాజ్ ఆటో 3% డౌన్!

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 170 పాయింట్లకుపైగా కోల్పోయి 80,543 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 24,538 వద్ద కొనసాగుతోంది. బజాజ్ ఆటో 3%, హీరో మోటార్ కార్ప్, కోల్ ఇండియా చెరో 2% నష్టాన్ని నమోదు చేయడం మార్కెట్పై ప్రభావం చూపింది. ఆయిల్ & గ్యాస్, IT, PSU బ్యాంక్ మినహా ఇతర రంగాల షేర్లు అన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Similar News
News September 19, 2025
ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే దాదాపు 13 బిల్లులకు ఆమోదం తెలిపింది. వాహనమిత్ర కింద ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు అందించే పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని పరిధిలో 343 ఎకరాల భూసేకరణకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అటు నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లును ఆమోదించింది.
News September 19, 2025
వాహనదారులకు గుడ్ న్యూస్.. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు

AP: పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మోటార్ వాహనాల చట్టంలో సవరణ చేస్తూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సభలో బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుకు ఆమోదం లభించడంతో ఓల్డ్ వెహికల్స్పై గ్రీన్ ట్యాక్స్ రూ.20 వేల నుంచి రూ.3వేలకు తగ్గనుంది.
News September 19, 2025
తమిళనాట పట్టు కోసం రసపట్టుగా పాలిట్రిక్స్!

వచ్చే వేసవిలో ఎన్నికలున్న తమిళనాడులో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. ఇన్నాళ్లూ పాలు నీళ్లలా ఉన్న DMK-కాంగ్రెస్ల స్నేహం చెడినట్లుంది. DMK తమను చెరుకుగడలా వాడుకుని పీల్చి పిప్పి చేసి వదిలేసిందని TN-PCC ex చీఫ్ KS అళగిరి ఆరోపించారు. DMKతో కలవాలంటే ఈసారి కాంగ్రెస్కు మంత్రి పదవులు, గతంలో కంటే ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే TVK (విజయ్)తో పొత్తుకూ వెళ్తామని సంకేతాలిచ్చారు.