News March 6, 2025
Stock Markets: అప్రమత్తంగా ఇన్వెస్టర్లు..

దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాటుగా చలిస్తున్నాయి. నిఫ్టీ 22,271 (-62), సెన్సెక్స్ 73,502 (-231) వద్ద ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. US జాబ్డేటా, వడ్డీరేట్ల తగ్గింపు ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. O&G, మీడియా, మెటల్, ఎనర్జీ, బ్యాంకు, రియాల్టి షేర్లు ఎగిశాయి. కన్జూమర్ డ్యురబుల్స్, ఫైనాన్స్, FMCG షేర్లు స్వల్పంగా ఎరుపెక్కాయి.
Similar News
News March 4, 2026
దుబాయ్, ఖతర్లో అమెరికా లక్ష్యాలపై ఇరాన్ దాడులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. దుబాయ్లోని US కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మరోవైపు ఖతర్లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం అల్ ఉదైద్ లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ మిస్సైల్స్ను ప్రయోగించింది. వీటిలో ఒకదాన్ని డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకోగా రెండో క్షిపణి ఎయిర్ బేస్ను తాకింది. ఈ ఘటనల్లో ఆస్తి నష్టం సంభవించినా ప్రాణనష్టం జరగలేదు.
News March 4, 2026
రేపు టెన్త్ హాల్ టికెట్లు విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి <
News March 4, 2026
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు?

జూన్ తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుత పాలకవర్గాల గడువు ఏప్రిల్ 2తో ముగియనుండగా ప్రత్యేక పాలన విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏకసభ్య కమిషన్ నివేదిక, BC రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభానికి 3నెలలు పట్టే అవకాశం ఉంది. కమిషన్ నివేదిక ఆలస్యమైనా, రిజర్వేషన్ల అంశం కోర్టుకెక్కినా పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం కావచ్చు. అటు పరిషత్ ఎన్నికల తర్వాతే ‘పంచాయతీ’ నిర్వహించాలనే వాదనా ఉంది.


