News March 6, 2025
Stock Markets: అప్రమత్తంగా ఇన్వెస్టర్లు..

దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాటుగా చలిస్తున్నాయి. నిఫ్టీ 22,271 (-62), సెన్సెక్స్ 73,502 (-231) వద్ద ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. US జాబ్డేటా, వడ్డీరేట్ల తగ్గింపు ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. O&G, మీడియా, మెటల్, ఎనర్జీ, బ్యాంకు, రియాల్టి షేర్లు ఎగిశాయి. కన్జూమర్ డ్యురబుల్స్, ఫైనాన్స్, FMCG షేర్లు స్వల్పంగా ఎరుపెక్కాయి.
Similar News
News March 6, 2025
ఓటమి మరింత బాధ్యతను పెంచింది: నరేందర్ రెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తనకు మరింత బాధ్యతను పెంచిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెక్నికల్గా తాను ఓడిపోయినప్పటికీ నైతిక విజయం మాత్రం తనదేనని, పట్టభద్రులంతా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వెల్లడించారు.
News March 6, 2025
‘ప్యారడైజ్’లో నాని లుక్ వెనుక కథ ఇదే!

‘ప్యారడైజ్’ టీజర్లో నేచురల్ స్టార్ నాని ఊరమాస్ లుక్తో పాటు జడలు వేసుకొని కనిపించారు. అందరినీ ఆకర్షించిన ఆ లుక్పై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్పందించారు. రెండు జడలకు, తన బాల్యానికి కనెక్షన్ ఉందని చెప్పారు. చిన్నప్పుడు తనను తల్లి అలాగే జడలు వేసి పెంచిందని, ఆ స్ఫూర్తితోనే నాని పాత్రను డిజైన్ చేశానని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ప్యారడైజ్’ మూవీ 2026 మార్చిలో విడుదల కానుంది.
News March 6, 2025
అధికారంలోకి వచ్చేది వైసీపీనే: గోరంట్ల మాధవ్

AP: కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పక్కకు పెట్టి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పైనే దృష్టి పెట్టిందని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం చేసిన కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు భయపడేదిలేదని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు.