News December 30, 2024

Stock Markets: రూ.4లక్షల కోట్ల నష్టం

image

బెంచ్‌మార్క్ సూచీలు భారీగా నష్టపోయాయి. ఒకానొక దశలో 850 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ ప్రస్తుతం 464 పాయింట్ల నష్టంతో 78,222 వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 153 Pts తగ్గి 23,657 వద్ద చలిస్తోంది. FIIల అమ్మకాలు, రూపాయి పతనం, గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు రావడమే ఇందుకు కారణాలు. దీంతో మదుపరులు రూ.4లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.

Similar News

News November 19, 2025

NRPT: 3వ జిల్లా మహా సభలు విజయవంతం చేయాలి

image

జిల్లా కేంద్రంలో జరిగే PDSU జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. మహా సభల వాల్ పోస్టర్లను బుధవారం నారాయణపేట పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22, 23 రెండు రోజులు మహా సభలు జరుగుతాయని, విద్యార్థులు, విద్యావంతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నేతలు పాల్గొన్నారు.

News November 19, 2025

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్

image

భారత సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 513 పాయింట్లు పెరిగి 85,186.47(0.61%) వద్ద ముగిసింది. నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 26,052.65(0.55%) వద్ద క్లోజ్ అయ్యింది. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.34% పెరగ్గా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.39% పడిపోయింది. ఓవరాల్‌గా BSE లిస్టెడ్ కంపెనీలు రూ.474.6 లక్షల కోట్ల నుంచి రూ.475.6 లక్షల కోట్లకు చేరాయి. అంటే సింగిల్ సెషన్‌లోనే రూ.లక్ష కోట్లకు పైగా లబ్ధి పొందాయి.

News November 19, 2025

BREAKING: ఖాతాల్లో రూ.7,000 జమ

image

AP: పీఎం కిసాన్ డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. ప్రధాని మోదీ TNలోని కోయంబత్తూరులో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. దీంతో దేశంలో అర్హులైన రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమయ్యాయి. అటు కడప జిల్లా పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు బటన్ నొక్కి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను రిలీజ్ చేశారు. దీంతో రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో యాడ్ అయ్యాయి. మొత్తంగా రూ.7 వేల చొప్పున జమయ్యాయి.