News December 19, 2024

STOCK MARKETS: రూ.5లక్షల కోట్ల నష్టం

image

స్టాక్‌మార్కెట్లు విలవిల్లాడాయి. ఊహించినట్టుగానే భారీ నష్టాల్లో ముగిశాయి. US FED 25BPS వడ్డీరేట్ల కోత, భవిష్యత్తులో ఎక్కువగా తగ్గించకపోవచ్చన్న అంచనాలే ఇందుకు కారణం. నిఫ్టీ 23,951 (-247), సెన్సెక్స్ 79,218 (-964) వద్ద స్థిరపడ్డాయి. దీంతో మదుపరులు ఏకంగా రూ.5L కోట్ల మేర సంపదను కోల్పోయారు. నేడు ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. BAJAJFINSV, JSWSTEEL, BAJFIN, GRASIM, ASIANPAINT టాప్ లూజర్స్.

Similar News

News September 20, 2025

కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తా: పవన్

image

AP: కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘శంకరగుప్తం మేజర్ డ్రయిన్ వెంబడి ఉన్న గ్రామాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్న విషయం నా దృష్టికి వచ్చింది. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం.. ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. దసరా తర్వాత అక్కడికి వెళ్లి రైతాంగాన్ని కలిసి, తోటలు పరిశీలిస్తా’ అని ట్వీట్ చేశారు.

News September 20, 2025

రేపటి నుంచే సెలవులు.. హైవేపై రద్దీ

image

తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 22 నుంచి దసరా సెలవులు మొదలవనుండగా ఆదివారం కలిసి రావడంతో రేపటి నుంచే హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. దీంతో HYD-విజయవాడ హైవే వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతోంది. HYD నుంచి ఆంధ్రాకు, ఆంధ్రా నుంచి HYDకు రాకపోకలు సాగించేవారితో టోల్‌ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది. ఇక ఏపీలో వచ్చేనెల 3న, టీజీలో 4న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. అప్పటివరకు విద్యార్థులు సెలవులు ఎంజాయ్ చేయనున్నారు.

News September 20, 2025

17 మంది ఇంజినీర్లపై సీఎంకు ఏసీబీ నివేదిక

image

TG: TGSPDCL ఇంజినీర్ల అక్రమాలపై ACB ఫోకస్ పెట్టింది. ఇటీవల ADE <<17730161>>అంబేడ్కర్<<>> వద్ద రూ.వందల కోట్లు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా మరో 17 మంది ఇంజినీర్ల అవినీతిపై CM రేవంత్‌కు ACB నివేదిక ఇచ్చింది. HYDలోని ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, మేడ్చల్, రాజేంద్రనగర్, కందుకూరులో ADE, CE స్థాయుల్లో పనిచేసిన వీరు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని పేర్కొంది. బదిలీ విధానంలో ఇంజినీర్లకు ఆప్షన్లిచ్చి అడ్డగోలుగా పోస్టింగ్స్ ఇచ్చిన తీరును ప్రస్తావించింది.