News February 5, 2025
Stock Markets: మీడియా, మెటల్, PSU బ్యాంకు షేర్లు అదుర్స్

దేశీయ స్టాక్మార్కెట్లు మోస్తరు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభపడినప్పటికీ గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. నిఫ్టీ 23,696 (-42), సెన్సెక్స్ 78,271 (-312) వద్ద క్లోజయ్యాయి. FMCG, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు ఎరుపెక్కాయి. మీడియా, మెటల్, PSU బ్యాంకు, O&G షేర్లు ఎగిశాయి. హిందాల్కో, ITC హోటల్స్, ONGC, అపోలో హాస్పిటల్స్, BPCL టాప్ గెయినర్స్.
Similar News
News November 13, 2025
రేపటి తరానికి మార్గదర్శనం మన అలవాట్లే

మంచి అలవాట్లు మన కోసమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి, ఇంట్లో పిల్లలకు ఆదర్శంగా ఉంటాయి. ఓ వ్యక్తి ఆఫీస్ సమయానికి 20 నిమిషాల ముందు లేచి, హడావిడిగా సిద్ధమయ్యేవాడు. కొన్నాళ్లకు అతడి కుమారుడు కూడా అదే పద్ధతిని అనుసరించాడు. మనం నేర్పించే ప్రతి పాఠం, మన నడవడిక నుంచే మొదలవుతుంది. అందుకే, మన అలవాట్లు మనల్నే కాక, మన తర్వాత తరాలను కూడా ప్రభావితం చేస్తాయని మరువకూడదు. మంచి అలవాట్లే నిజమైన వారసత్వం. <<-se>>#Jeevanam<<>>
News November 13, 2025
తెలంగాణ ముచ్చట్లు

* ఉన్నతాధికారులు పర్మిషన్ లేకుండా స్కూల్ నుంచి విద్యార్థులను బయటకు తీసుకెళ్లొద్దని హెడ్మాస్టర్లకు ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు
* ఫిరాయింపు MLAలను రేపు, ఎల్లుండి అసెంబ్లీలోని కార్యాలయంలో విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
* ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 34,023 మందికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగు దొడ్లు మంజూరు
* ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో టాప్-3లో జనగాం, ఖమ్మం, యాదాద్రి.. నిర్మాణ పనుల్లో 70% పురోగతి
News November 13, 2025
పదునెట్టాంబడి అంటే ఏంటి?

పదునెట్టాంబడి అంటే అయ్యప్ప స్వామి ఆలయంలో ఉండే 18 మెట్లు. ఈ మెట్లు మనిషి పరిపూర్ణత సాధించిన జ్ఞానానికి సంకేతాలు. జ్ఞాన సాధన చేసే అయ్యప్ప స్వాములు మాత్రమే వీటిని ఎక్కుతారు. వారికి ప్రత్యేకంగా పడిపూజ చేస్తారు. ఈ మెట్లు ఎక్కడం అనేది జ్ఞాన మార్గంలో సాగే ఆధ్యాత్మిక ప్రయాణానికి గుర్తుగా భావిస్తారు. ప్రతి మెట్టూ అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగిస్తుంది. పరిశుద్ధమైన మనసుతోనే ఈ మెట్లెక్కాలి. <<-se>>#AyyappaMala<<>>


