News October 22, 2024

STOCK MARKETS: మిడ్, స్మాల్ షేర్లు క్రాష్

image

బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్‌గా చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్ సిగ్నల్స్ అందాయి. నెగటివ్ సెంటిమెంటు వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 81,133 (-24), నిఫ్టీ 24,770 (-10) వద్ద ట్రేడవుతున్నాయి. స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు క్రాష్ అవుతున్నాయి. రియల్టీ, మీడియా, మెటల్ రంగాలపై సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. టాటా స్టీల్, టాటా మోటార్స్, M&M, మారుతీ టాప్ లూజర్స్.

Similar News

News October 22, 2024

CRPF స్కూళ్లకు బాంబు బెదిరింపులు

image

దేశ వ్యాప్తంగా ఉన్న CRPF స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ వచ్చాయి. ఇది ఆకతాయిలు చేసిన పనిగా తెలుస్తున్నప్పటికీ ఇటీవల ఢిల్లీలోని ఓ స్కూల్‌లో పేలుడు ఘటన కారణంగా ఆందోళన నెలకొంది. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను క్లాస్ రూమ్స్‌లో అమర్చినట్లు ఆ మెయిల్స్‌లో ఉంది.

News October 22, 2024

ఆ బ్లాంకెట్లు నెలకు ఒకసారే ఉతుకుతారు!

image

ట్రైన్స్‌లోని ఏసీ కోచుల్లో అందించే బ్లాంకెట్స్‌ను నెలకు ఒకసారి మాత్రమే ఉతుకుతారని ఆర్టీఐలో వెల్లడైంది. ఉన్ని దుప్పట్లను నెలకు ఒకసారి, కొన్నిసార్లు రెండుసార్లు అందుబాటులో ఉన్న సామర్థ్యం మేరకు ఉతుకుతామని రైల్వే శాఖ RTI ద్వారా TNIEకి తెలిపింది. గరీబ్ రథ్, దురంతో వంటి రైళ్లలో దుప్పట్లకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. దీంతో నిత్యం ప్రయాణికులు వాడేవాటిని ఉతక్కపోవడం ఏంటని నెటిజన్లు ఫైరవుతున్నారు.

News October 22, 2024

మూసీ కాంట్రాక్టు పొంగులేటికేనా?

image

TG: ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవం కాంట్రాక్టును మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. అందుకే కొరియాలో పర్యటిస్తున్న బృందంలో పొంగులేటి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది.