News August 25, 2025

లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్స్

image

గ్లోబల్ మార్కెట్లో పాజిటివ్ సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 223 పాయింట్ల లాభంతో 81,530, నిఫ్టీ 56 పాయింట్ల వృద్ధితో 24,926 వద్ద ట్రేడింగ్ స్టార్ట్ అయింది. టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, ట్రెంట్ లాభాల్లో ట్రేడవుతుండగా, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సెర్వ్, మారుతీ సుజుకీ, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Similar News

News August 25, 2025

ఉత్తమ టీచర్ అవార్డులు ప్రకటించిన కేంద్రం

image

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు 45 మంది <>టీచర్లను <<>>కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో వారికి అవార్డులు ప్రదానం చేయనుంది. APలోని విశాఖ నెహ్రూ మున్సిపల్ హైస్కూలుకు చెందిన తిరుమల శ్రీదేవి, TGలోని సూర్యాపేట పెన్‌పహాడ్ ZPHSకు చెందిన మరమ్ పవిత్ర ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఎంపికైన టీచర్లను రూ.50,000 నగదు, వెండి పతకంతో సత్కరిస్తారు.

News August 25, 2025

మోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలన్న ఆదేశాలు కొట్టివేత

image

PM మోదీ డిగ్రీ సమాచారాన్ని బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార కమిషన్(CIC) ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. తాను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1978లో BA పాసైనట్లు గతంలో మోదీ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనగా, ఆ వివరాల కోసం ఓ వ్యక్తి RTI దాఖలు చేశారు. ఈ వివరాలు ఇవ్వాలని CIC ఆదేశాలు జారీ చేయగా, వాటిని ఢిల్లీ వర్సిటీ కోర్టులో సవాల్ చేసింది.

News August 25, 2025

CM రేవంత్‌కు రక్షణగా బీజేపీ ఎంపీలు: KTR

image

TG: BJP MPలు CM రేవంత్‌కు రక్షణగా ఉంటున్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘6 గ్యారంటీలపై BJP MPలు ఎప్పుడైనా రేవంత్‌ను ప్రశ్నించడం చూశారా? KCRపై మాత్రం మాట్లాడతారు. బడే భాయ్ (మోదీ), చోటా భాయ్ (రేవంత్) కలిసి పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆటలో అరటిపండు లాంటివాడు. ఆయనకు ఎప్పుడో దెబ్బ పడుతుంది’ అని వ్యాఖ్యానించారు. గత 11 ఏళ్లలో TGకి BJP ఎలాంటి సాయం చేయలేదని, గాయాలు చేసిందని విమర్శించారు.